ఆసియా ఖండంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. విశ్వనగర హంగులతో కూడిన హైదరాబాద్ నగరంలో పరిశుభ్రమైన ప్రాణవాయువు అందించేందుకు ప్రస్తుతం ఉన్న సాంప్రదాయక వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రవేశపెట్టాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి జీవితకాల రహదారి పన్ను మిన హాయింపు, ఈవీ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేవారికి పలు రాయితీలతోపాటు రుణ సౌకర్యం కల్పిస్తున్నది. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేందుకు ముం దుకు వచ్చేవారికి కూడా ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో ఈవీ వాహనాల తయారీలో 23 స్టార్టప్ కంపెనీలున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మాసాంతం వరకు 38 వేల విద్యుత్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో 33 వేలు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. విద్యుత్ వాహన యాజమానులకు రూ.121 కోట్ల లైఫ్ టాక్స్ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
హైదరాబాద్లో 13734.59 Ggల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. (ఒక Gg యూనిట్ ఒక మిలియన్ kgలకు సమా నం). కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో 53 లక్షల వాహనాలున్నాయి. వీటిద్వారా 56.86 శాతం (7809.5 Gg ) కార్బన్ డై ఆక్సైడ్లు వెలువడుతున్నాయి. ఇది, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) NAARQS నాణ్యతా ప్రమా ణాలకన్నా ఎంతో అధికం. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు రూ.5147 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ తయారీ యూనిట్లను పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో ప్రధానంగా, ట్రైటోన్ ఎలక్ట్రిక్ రూ.2100 కోట్ల వ్యయంతో జహీరాబాద్ నిమ్జ్లో తన తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తు న్నది. జర్మనీకి చెందిన లిటీయూతో GmH కంపెనీ రూ.1500 కోట్ల వ్యయంతో రానున్న రెండేండ్లలో ఈవీ వాహనాల తయారీకి పెట్టు బడులు పెట్టనున్నది. వీటితోపాటు మరో రెం డు కంపెనీలైన గ్రావీటోన్ రూ.150 కోట్ల వ్యయంతోనూ, కాలిఫోర్నియాకు చెందిన బిలి టీ ఎలక్ట్రిక్ కంపెనీ రూ. 1147 వ్యయంతోనూ తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ఏర్పాటు చేయనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 110 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లను వివిధ ప్రాం తాల్లో ఏర్పాటుచేసింది. తెలంగాణలో రాను న్న ఐదేండ్లలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ప్రోత్సాహానికి రూ.10 వేల కోట్ల వ్యయం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ప్రజా రవాణా రంగంలో ఈ- వాహనాలను ప్రవేశపె ట్టనున్నది. 7090 ఈ- బస్సులు, 55 వేల ఫోర్వీలర్ పాసింజర్ కార్లు, పది లక్షల ద్విచక్ర వాహనాలు (టూ వీలర్లు)లను ప్రవేశపెట్ట డంతోపాటు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్ నగరంలో 180, కరీం నగర్లో పది, వరంగల్లో పది, హైదరాబాద్ ఓఆర్ఆర్పై 16 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పా టుచేయనున్నారు. అన్నిరకాల ఈవీ వాహనా లకు రోడ్టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ తదితర రాయితీలను ప్రకటించారు. అన్ని మెట్రో రైల్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు బ్యాటరీతో నడిచే షటిల్ సర్వీసులను నడపనున్నారు.
– కన్నెకంటి వెంకటరమణ
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్)