డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు తరచుగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారసభల్లో, పార్టీ సమావేశాల్లో గొప్పలకు పోతుం టారు. మోదీ అనుంగు మీడియా కూడా ఈ పదాన్ని విస్తృ తంగా ప్రచారం చేస్తున్నది.
కేంద్రంతో పాటు, రాష్ర్టాల్లో కూడా బీజేపీనే అధికారంలో ఉండాలన్నది ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ పదం అర్థం. అయితే, ఈ వ్యాఖ్య రాజ్యాంగ విరుద్ధమైనది. డబుల్ ఇంజిన్ సర్కా ర్తోనే పనులవుతాయంటే, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలు చేతకానివని బీజేపీ పరోక్షంగా చెబుతు న్నట్లే. అంటే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలను, ప్రజా తీర్పు ను బీజేపీ ఒకరకంగా అవమానపరుస్తున్నట్లే. అలా ప్రజల చేత ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాలకు కేంద్రం ఎటువంటి సాయం చేయదని కూడా ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అనే వ్యాఖ్య ద్వారా పరోక్షంగా అర్థమవుతున్నది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలోని పలు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. ఆ పథకాలను, ప్రభుత్వాల పనితీరును గుర్తించకుండా ఉచిత పథకాలు దేశ ఆర్థికవ్యవ స్థ కు మంచివి కావని స్వయాన ప్రధాని మోది అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటు. పైగా ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అం టూ ఆయన కూడా రాజకీయం చేయజూడటం ప్రజాస్వామ్యా నికే విరుద్ధం. దేశంలో సమాఖ్యతత్వానికి ఈ తరహా ప్రకట నలు పెను ప్రమాదం. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వీటిపై దృష్టిసారించాలి. ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అనే పదాన్ని, ఆ అర్థాన్నిచ్చే ఇతర పదాలను ఎన్నికల ప్రచార సభల్లో గానీ, ఇతర సమావేశాల్లో గానీ వాడకుండా ఆదేశాలు జారీచేయాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రజాస్వామ్యాన్ని కాపా డాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరిపై ఉన్నది. ఆ దిశగా చర్యలు మొదలవుతాయని ఆశిద్దాం.
– సీవీఆర్ కృష్ణ, హైదరాబాద్