పిల్ల పుట్టకముందే.. ఎనకటికి ఒకడు కుల్ల కుట్టి పెట్టిండనేది తెలంగాణలో సామెత. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ పోయిన విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే, ఐదుగురు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు రేవంత్రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ వరుస పరాజయాలతో ఒకరిద్దరు తప్ప మహిళానేతలెవరూ గాంధీభవన్ వైపు తొంగిచూడటం లేదట. దీంతో మంత్రి పదవులను ఎర చూపితేనైనా వస్తారేమోనని ఆశపడుతున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.