కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుందన్న అభిప్రాయం క్రమేణా బలపడుతున్నది. బీజేపీ వ్యాక్సిన్ ఎంత బాగా పనిచేస్తున్నదో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ పాటిల్ మీడియాకు బాహాటంగానే చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్లో ఉన్నంతకాలం తనకు ఈడీ, సీబీఐ, ఐటీల భయంతో కంటిమీద కునుకు పట్టేది కాదని, అయితే బీజేపీలో చేరాక ప్రస్తుతం కంటి నిండా నిద్ర పోతున్నానని మీడియాకు వెల్లడించారు. మరి ‘ఇట్లుంటది…బీజేపీతోని’ అంటూ ఈ వ్యాక్సిన్కు హర్షవర్ధన్ పాటిల్ బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ వ్యాక్సిన్ వల్ల దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఒక్కటే కాదు.. బంపర్ ఆఫర్గా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కూడా దక్కుతాయని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తెలంగాణ నాయకుడు ఒకరు ఇటీవల ఇతరులకు గాలం వేస్తున్నట్టు వినికిడి.