మహా మార్పు మొదలైంది.. ఆ మార్పు దేశమంతా విస్తరిస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో తక్కువ సమయంలోనే ప్రభావశీల శక్తిగా ఎదిగింది. ఇప్పడు బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దేశంలో ఒక నూతన విప్లవం దిశగా అడుగులు వేస్తున్నది.
మహారాష్ట్రలో రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. బీఆర్ఎస్ ఎంట్రీ చినుకుగా మొదలై తుఫాన్లా మరాఠాగడ్డపై విస్తరిస్తుండటంతో ఆ పార్టీల పునాదులు కదులుతున్నాయి. మొన్న శరద్పవార్ నోట బీఆర్ఎస్ మాట దీన్ని తేటతెల్లం చేసింది. శివసేన (ఏక్నాథ్షిండే) పార్టీలోనూ వేడి పుట్టింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రవేశిస్తే తాము తెలంగాణలోకి అడుగు పెడుతామని ప్రకటించడం వారి భయాన్ని తెలియజేస్తున్నది. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా బీఆర్ఎస్ దూకుడును చూసి బిత్తరపోతున్నాయి.
మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్ర రాజకీయాల్లో గులాబీ విప్లవం మొదలైంది. ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, శివసేన తదితర పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తెలంగాణ మాడల్ను మహారాష్ట్రలో అభివృద్ధి చేయాలని, తెలంగాణ సంక్షేమం అమలు కావాలంటే బీఆర్ఎస్ రావాల్సిందేనని అక్కడి ప్రజలు, రైతులు, యువత బలంగా కోరుకుంటున్నారు.
ఇటీవల రెండు రోజులపాటు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. సోలాపూర్ సమీపంలో ని పండరీపూర్ విఠలేశ్వరస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్కోలీ బహిరంగసభలో పాల్గొన్నారు. మహారాష్ట్ర నేత భగీరథ బాల్కేతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహా పర్యటన సందర్భంగా కేసీఆర్కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున యువత, రైతులు, మహిళలు కేసీఆర్కు నీరాజనాలు పలికారు. 600 వాహనాల భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ పర్యటన సాగిం ది. మహారాష్ట్రలో ఏ నోట విన్న కేసీఆర్ నినాదమే. ఎక్కడ చూసి నా బీఆర్ఎస్ జిందాబాద్లే.
తెలంగాణ అంటే అభివృద్ధ్ది, తెలంగాణ అంటే సంక్షేమం. తెలంగాణ అంటే పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం. తెలంగాణ అంటే సబ్బండ వర్గాల ప్రభుత్వం. తెలంగాణ అంటే నీళ్ల ప్రపం చం. తెలంగాణ అంటే వ్యవసాయం. తెలంగాణ అంటే నియామకాల విజేత. ఏ కోణంలో చూసి నా, ఏ రంగంలో చూసి నా తెలంగాణ అంటే ప్రగతి చిహ్నం. ఈ ప్రగతి రథ చక్రమే దేశానికి మార్గదర్శి. దేశం కూడా ప్రగతివైపు పరుగెత్తాలంటే కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు అదే స్ఫూర్తితో దేశం వైపు దూసుకుపోతున్నది బీఆర్ఎస్ రథం. నాటి బతుకు సారం బోధించిన నాయకత్వం నేడు దేశం బతుకు చిత్రాన్ని ఆవిష్కరించేందుకు కదులుతున్నది.
సంకుచిత రాజకీయాలను తుదముట్టించేందుకు భారత విజయ కంకణం కట్టుకున్న కథానాయకుడు కేసీఆర్. మరో గర్జన మహోద్యమానికి ఉక్కు పిడికిలి బిగించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆందోళన నుంచి బయటపడాలంటే భరోసానిచ్చే నాయకుడు అవసరం. అందుకే దేశం కేసీఆర్ను పిలుస్తున్నది. మోదీ ప్రభుత్వ విధానాలపై పోరాటం ఒక్క కేసీఆర్కే సాధ్యమని దేశం నమ్ముతున్నది.
మొన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పెద్ద ఎత్తున యువ ప్రభంజనం తర లి వచ్చింది. కేసీఆర్ చెప్పిన ప్రతి విషయాన్ని వారు ఎంతో శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. అంతే ఉత్సాహంగా పని చేస్తున్నారు. అక్కడ దాదాపు 11 లక్షలకు పైగా మహా గులాబీ సైన్యం తయారైంది. రానున్న కొద్దిరోజుల్లో 30 లక్షల మందికి పైగా క్రియాశీలక సైన్యం తయారవుతుంది. ఇప్పటికే నాగ్పూర్లో పార్టీ ఆఫీస్ను కేసీఆర్ ప్రారంభించారు. గత కొద్దికాలం నుంచి గమనిస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కా వ్యూహం తో మహారాష్ట్ర నుంచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ మీట నొక్కితే దేశమంతా వెలుగుతుందో తనకు తెలుసు. సరిగ్గా ఇప్పుడు కేసీఆర్ మహారాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని మాట్లాడిన బీఆర్ఎస్ విస్తరణను ఆపలేరు. ఇప్పటికే మహారాష్ట్ర మొత్తం గులాబీ జెం డా రెపరెపలాడుతున్నది.