బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడమే కాదు, ఏకంగా 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామనే భ్రమల్లో బీజేపీ నాయకులు ఉండటం హాస్యాస్పదం. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగా ‘చేరికల కమిటీ’ అని వేసి, ఆస్తుల రక్షణ కోసం బీజేపీలోకి వలస వచ్చిన ఈటెల రాజేందర్ను దానికి చైర్మన్గా నియమించడం మరీ విచిత్రం. తెలంగాణలోని ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను బెదిరించి, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా లొంగదీసుకోవడం, లేదంటే డబ్బు ఎరజూపి కొనడం ఈ బీజేపీ చేరికల కమిటీ చేసే పని.
ఆస్తుల రక్షణ కోసమో, లేక ఆ పార్టీ బెదిరింపులకు లోబడో కొందరు నాయకులు బీజేపీలో చేరుతున్నారు. అయితే అలా చేరినవారు ఆ పార్టీలో ఇమడలేక మళ్లీ బయటకు వస్తుండటం ఆ పార్టీ అంతర్గత వివాదాలను స్పష్టం జేస్తున్నది. నాగం జనార్దన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఒక ఫోరం ఏర్పాటుచేసుకొని, తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తదితరులు బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలను తట్టుకోలేక బయటకువచ్చారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 5 ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. అవే ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా 63 స్థానాలను గెలిచింది. 2018 తర్వాత తెలంగాణలో జరిగిన 5 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 3, బీజేపీ 2 స్థానాలు అభ్యర్థుల వ్యక్తిగత బలం వల్లే గెలిచింది. ఆ పార్టీకి నాగార్జునసాగర్, హుజూర్నగర్లలో డిపాజిట్ కూడా దక్కలేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మతం పేరుతో ప్రజలను చీల్చడం, విద్వేష రాజకీయాలు చేయడమే బీజేపీ పని. 250 ఏండ్ల కిందట జరిగిన దాడులకు, నేడు దేశంలో ఉన్న ఒక మతం ప్రజలను బాధ్యులుగా చేయడం ఎంతవరకు సబబు?
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం తొమ్మిదేండ్లలో అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2014లో రూ.1,24,000 ఉంటే ఇప్పుడు అదే తలసరి ఆదాయం రూ.3,17,000. 2014కు ముందు విద్యుత్ ఎప్పుడు పోయేదో, ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందుతున్నది. 2020-21లో తెలంగాణ రైతాంగం ఏకంగా 3 కోట్ల టన్ను వరి ధాన్యం పండిస్తే కేంద్రం కొనలేక చేతులెత్తేసింది. టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 3 లక్ష ల కోట్ల పెట్టుబడులు రాగా, 19 లక్షల మం ది ఉపాధి పొందారు. తెలంగాణకు బీజేపీ చేసినంత ద్రోహం మరే పార్టీ చేయలేదు. విభజన చట్టంలోని కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, అసెంబ్లీ సీట్ల పెంపు, కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటా, వెనుకబడిన జిల్లాలకు నిధులు తొమ్మిదేండ్ల తర్వా త కూడా అమలుచేయలేదు. స్వయంగా కేసీఆర్, మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులకు విన్నవించినా ఫలితం దక్కలేదు.
తెలంగాణలో ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జోడించి సుపరిపాలనను అందిస్తున్నది. కొన్ని అద్భుత విధానాలను రూపొందించి మంచి ఫలితాలను సాధించింది. వ్యవసాయం కావచ్చు, టీఎస్-ఐపాస్ కావచ్చు, జల విధానం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. గురుకుల విద్యావిధానం కావచ్చు.. ఈ అభివృద్ధి సరి గా లేదంటే బీజేపీ వద్ద ఉన్న డెవలప్మెంట్ మోడల్ ఏమిటో ప్రజలకు వివరించండి. అంతేకానీ తిట్ల పురాణమే మా సిద్ధాంతం, వ్యక్తిగత దూషణలే మా విధానం అంటే బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజ లు లేరు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిన తర్వా త ఎవరూ నోరు మెదపడం లేదు. ఉప ఎన్నికకు ముందు నెలలో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, జైలుకు పంపుతాం, వాళ్లు టచ్ లో ఉన్నారు, వీళ్లు టచ్లో ఉన్నారని 30 మంది ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో చేరుతారని ఊదరగొట్టింది బీజేపీ. బండి సంజయ్ది ఓ గ్రూపు, కిషన్రెడ్డిది మరో గ్రూపు, ఈటెలది ఇంకో గ్రూపు. ఆత్మను చంపుకొని అవసరాల కోసం బీజేపీలో చేరి న ఈటెల పరిస్థితి డోలాయమానంగా ఉన్న ది. ఆయన ఎంతకాలం ఆ పార్టీలో ఉంటా డో తెలియని పరిస్థితి.
అదానీ స్కాం దేశాన్ని కుదిపేయగా, మోదీ, బీజేపీని ప్రతిష్ట దిగజార్చింది. అదానీతో సంబంధం లేదంటున్న బీజేపీ జేపీసీ కమిటీ ఎందుకు వేయడం లేదు. సామాన్యు ల సొమ్ము 12 లక్షల కోట్లు ఆవిరైపోయినా, తన ఆప్తమిత్రుడు అదానీని కాపాడేందుకే మోదీ సిద్ధమయ్యారు.
విపక్షాలను లొంగదీసుకునేందుకే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ విచారణకు పిలిచి, అరెస్టు చేశారు. బీజేపీకి శివసేన, అకాలీదళ్, జేడీయూ దూరమై సీబీఐ, ఈడీ, ఐటీ దగ్గరయ్యాయి. తాజాగా మార్చి, 10న ఢిల్లీ జంతర్మంతర్లో ‘మహిళా రిజర్వేషన్’ కోసం ఒక్కరోజు దీక్ష తలపెట్టిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపడం అత్యంత ఖండనీయం. బీజేపీ అభద్రతాభావంలోకి కూరుకుపోతున్నదని దీన్నిబట్టే తెలుస్తున్నది.
రాష్ట్రంలో ఎన్నికలకు 10 నెలల సమ యం మాత్రమే ఉండగా బీజేపీకి మాత్రం అభ్యర్థులు కరువయ్యారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మేధావులు, ప్రజలు వైరుధ్యాలను అధ్యయనం చేసి, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న బీజేపీని ఓడించకపోతే దేశం వందేండ్లు వెనక్కిపోతుంది. ఇప్పటికే సమాజానికి బీజేపీ చేసిన నష్టం పూడ్చాలంటే ఒక తరం పడుతుంది.
– ఓ.నరసింహారెడ్డి
80080 02927
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు)