తెలంగాణ వంటి ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరిగే తాటి, ఈత, ఖర్జూర, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్కహాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, బీహార్, ఒడిశా వంటి రాష్ర్టాల్లో నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు వాడుకలో ఉన్నాయి. నీరాను సేవించడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. నీరా తాగితే పలు రకాల వ్యాధులు నివారించబడుతాయని పరిశోధనల్లో వెల్లడైంది.
ప్రకృతి సహజ పానీయమైన నీరాను దాని అనుబంధ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తే ప్రజారోగ్యానికి చక్కటి పునాది ఏర్పడే అవకాశం ఎంతైనా ఉన్నది. నీరా ను అన్ని వయసుల వారు, ముఖ్యంగా స్త్రీలు, గ ర్భిణీలు, పిల్లలు కూడా తాగవచ్చు. అయితే నీరా కు, కల్లుకు వ్యత్యాసమున్నది. సహజసిద్ధమైన పోషక విలువలు గల తీయటి పానీయం ‘నీరా’ దీంట్లో విశేషం ఏమిటంటే, అప్పుడే చెట్ల నుంచి తీసిన నీరాలో ఆల్కహాల్ అస్సలు ఉండదు. తా జాగా చెట్లనుంచి సేకరించిన నీరాలో సుక్రోజు, ప్రోటీన్స్, ఆస్కార్బిక్ యాసిడ్ థయామిన్, రిబోఫ్లెవిన్, విటమిన్ సీ, పాలలో కంటే ఎక్కువ కెలోరీల శక్తి, పోలిక్ యాసిడ్ ఇతర విటమిన్లు కూడా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. నీరా,దాని ఉప ఉత్పత్తుల్లో ైగ్లెసేమిక్ ఇండెక్స్ తక్కువ అని పలు పరిశోధనలు చెప్తున్నాయి. దానివల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి హాని ఉండకపోగా మే లు జరుగుతుందని తెలుస్తున్నది.
నీరాను ప్రధానంగా తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత కుండను తాటి, ఈత చెట్లకు కట్టి సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కు వ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోద యం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది. ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాలైన భారత్ వంటి అనేక దేశాల ప్రజలకు నీరా ఆరోగ్య ప్రదాయిని అని చెప్పాలి. ఉష్ణమండల దేశాల్లో మనుషులు త్వ రగా అలసిపోయి శరీరంలోని పోషకాలను వేగం గా కోల్పోతారు కనుక ఈ నీరాను సేవించడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. త్వరగా శక్తిని అందించే ఈ రీహైడ్రేషన్ ప్రక్రియ శరీరానికి చలువ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులున్నా, కామెర్ల వ్యాధికి ఇది ఔషధంగా పని చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి, మలబద్దకాన్ని పోగొట్టే నీరాను సేవిస్తే గ్యాస్ట్రిక్ సమస్య తొందరగా తగ్గుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ సూక్ష్మ జీవ శాస్త్ర విభాగం చేసిన పరిశోధనల్లో క్యాన్సర్ నివారణకు నీరా ఉపయోగపడుతుందని తేలింది. ఈ వివరాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి కూడా. మధుమేహ రోగులకు నీరా వరం లాంటిది. నీరాతో పాటు, ఉప ఉత్పత్తులైన నీరా తేనె, నీరా సిరప్, బెల్లం, గ్రాన్యుల్స్ (బూస్ట్లా ఉంటుం ది), నీరా చక్కెర, నీరా చాక్లెట్లు కూడా తయారు చేసేవిధంగా వృ త్తిదారులకు ప్రత్యేక నైపుణ్య శిక్ష ణ ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. దాని వల్ల వృత్తి దారులకు అదనంగా ఉత్పత్తి చేసి న నీరా వృథా కాకుండా అరికట్టడంతో పాటు వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది.
తెలంగాణ ప్రభుత్వం నీరాను ఆల్కహాల్ లేని పానీయంగా ప్రకటిస్తూ ఎక్సైజ్ చట్టంలో మార్పు లు చేసింది. నీరాకోసం చెట్లను ప్రత్యేకంగా కేటాయిస్తూ, నీరా సేకరణకు, రవాణాకు, అమ్మకానికి అనుమతులివ్వాలని నిర్ణయించింది. తద్వారా గీత వృత్తిలో ఉన్న పలువురు గౌడ యువకులకు ఉపాధి లభించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ప్రకృతి పానీయం అందుబాటులోకి రానున్నది. నీరాకు సహజ పానీయం గా ప్రచారం కల్పించి మధ్యతరగతి, ఉన్నత స్థా యి వారికి కూడా అందుబాటులోకి తెచ్చే విధం గా ప్రభుత్వం మొదటగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ను ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర మంతటా ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాలలో అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. నీరా గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి, ప్రగతికి కూడా దోహదకారి కానున్నది. నీరా తీయడానికి గౌ డ కులానికి చెందిన వృత్తిదారులకు మాత్రమే హక్కు కల్పించడాన్ని యువకులు, వృత్తిదారు లు హర్షిస్తున్నారు. తెలంగాణ ప్ర భుత్వానికి గౌడ కులస్థులు, వృత్తిదారులు ‘నీరా’జనం పలుకుతున్నారు.
డా. ఆనంద్ గోపగోని: 98482 56042