ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా మారుతుందనడానికి దేశ, విదేశీ సంస్థల గుర్తింపులు, కితాబులే ప్రామాణికం. స్వయంపాలనలో జోడెద్దుల్లాంటి అభివృద్ధ్ది, సంక్షేమం ఒక ఎత్తయితే పదేండ్లలోనే వందేండ్ల శాశ్వత నిర్మాణాలతో తెలంగాణ తనకు తానుగా పునర్నిర్మింపబడుతుండటం గొప్ప విషయం. దశాబ్దిలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఒకసారి నాటి తెలంగాణ చేదు గురుతులను మననం చేసుకుంటే దుఃఖం ఆగదు. బీడువారిన పొలాలు, పొక్కిలైన నేలలు, నెర్రెలువారి కండ్లళ్లకెళ్లి నెత్తురువారిన తెలంగాణ పల్లెల దుస్థితి తెలియంది కాదు. స్వరాష్ట్రం సిద్ధించాక కేవలం తొమ్మిదేండ్లలో తెలంగాణ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి.
తెలంగాణ రాష్ట్రమొస్తే సంక్షోభాల కుంప ట్లు రాజుకుంటాయని, అసలు పాలనే చేతకాదని, చిమ్మని చీకట్లుంటాయని అవహేళన చేసినవాళ్లే ఇవాళ తెలంగాణ నవ నిర్మాణాలు చూసి కితాబులిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరాయి నుంచి స్వయంపాలన ప్రస్థానా న్ని తీసుకుంటే ఇవాళ తెలంగాణ రీ ఇన్నోవేషన్, రీ కన్స్ట్రక్షన్ దిశగా దూసుకుపోతున్నది. కేసీఆర్ పాలన వందేండ్లకు పైగా గుర్తుండేవిధంగా తెలంగాణలో నవ నిర్మాణాలు అద్దం పట్టడంతో పాటు తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. తాజాగా రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించడమే దీనికి కొలమానం. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 20 23కి గాను ప్రకటించిన గ్రీన్ యాపిల్ అవార్డులను వివిధ విభాగాల్లో యాదాద్రి ఆలయం సహా ఐదు నిర్మాణాలు దక్కించుకున్నాయి.
కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గొడగొడ ఏడ్చిన గోదావరిని చేరదీసి సాగునీటి రంగంలో తొలి విజయాన్ని సాధించింది. తెలంగాణ నీటిపారుదల రంగం దుర్భర స్థితిని గుండెల నిండా దాచుకున్న కేసీఆర్ తొలిదశలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్ర మట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నాయి. 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ ఇంజిన్గా మారింది.
శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకానికి సైతం కాళేశ్వరం జలాలను ఉపయోగిస్తున్నారు. ఏడెండ్లలో పది పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, చనఖా- కొరాటా, సమ్మక్క, భక్తరామదాసు, తుమ్మిళ్ల బారేజీలను పూర్తిచేసింది. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రారంభానికి సిద్ధ్దంగా ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలకు తోడు మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి, జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. దీంతో చిన్న జిల్లాలతో రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన సాగుతున్నది. ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లకు సమీకృత భవనాలను నిర్మించింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచింది.
తెలంగాణ అన్నిరంగాల్లో దార్శనికతతో ముందుకుపోతున్నదనడానికి సచివాలయ నిర్మాణం అద్దం పడుతున్నది. 28 ఎకరాల విస్తీర్ణంలో 2.5 ఎకరాల్లో భవనాన్ని అత్యాధునిక హంగులు, సౌకర్యాలతో నిర్మించిన సచివాలయం 26 నెలల రికార్డు సమయంలో పూర్తికావడం విశేషం.
నూతన సచివాలయాన్ని ప్రారంభించుకున్న రెండు నెలల్లోనే తెలంగాణకు ‘లండన్ గ్రీన్ అవార్డు’ దక్కడం గర్వించదగిన విషయం. దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నిర్మించింది. అదేవిధంగా ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన మొజంజాహీ మార్కెట్ హైదరాబాద్కు ఐకానిక్ మార్కెట్గా పేరొందింది. ఈ మార్కెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం రూ.15 కోట్లతో ఆధునికీకరించింది. ఇక దేశంలోనే అరుదైన నిర్మాణం హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. కేబుల్ టెక్నాలజీతో దేశంలో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే.
అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదా ద్రి ఆలయం రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీద అందరూ అబ్బురపడేలా రూపుదిద్దుకున్న యాదగిరి గుట్ట ఆలయం ఆయన నవీన, ఆధ్యాత్మిక పాలనకు మచ్చుతునక. ఇదే తరహాలో కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న గుడుల పునర్నిర్మాణ పనులు కూడా ఊపందుకుంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కును 247 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున కొం డపై ఏర్పాటుచేసింది. ఆసియాలోనే అతిపెద్ద మహాస్థూపాన్ని అందమైన థీమ్పార్కును నిర్మించింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నందికొండ, ఆయన బోధించిన వచనాల విశేషాలను ప్రదర్శిస్తూ బుద్ధవనం చరిత్రకు నిలువుటద్దంలా నిలిచింది.
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు హైదరాబాద్లో ఒక మహాస్మృతి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు హైదరాబాద్లో ఒక మహాస్మృతి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచంలో అపూర్వమైనరీతిలో జ్వలించే మహా దీపకళిక రూపంలో ఈ అమరవీరుల స్థూపం ఉం డే లా, స్మృతికేంద్రం నిర్మాణమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు, ఆయన ఆశయాల సాధనకు ప్రజాప్రతినిధులు, అధికార గణాన్ని ఉద్యుక్తుల ను చేయాలన్న సంకల్పంతో ప్రపంచంలోనే అతి పెద్దదయిన 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు.
ఇక నవీన తెలంగాణలో వైద్యారోగ్య రంగం లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన చర్యల తో తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించింది. గచ్చిబౌలిలో టిమ్స్ను తీర్చిదిద్దగా చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం, వరంగల్లో అత్యాధునిక సౌకర్యాల తో రూ.1200 కోట్ల వ్యయంతో హెల్త్ సిటీ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
బండి పల్లవి: 91822 11810 (వ్యాసకర్త: వరంగల్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి)