బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ హర్రాజుల శాఖగా మారింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ ఆస్తులకు ఎసరుపెట్టిన కేంద్రం తాజాగా బీపీసీఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆస్తుల అమ్మకానికి కూడా సన్నాహాలు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ.65 వేల కోట్లు సమకూర్చుకోనున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదేండ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రకటించింది. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని తిరిగేసి ఏడాదికి కోటి ఉద్యోగాలను ఊడబెరికే పనిలో పడింది. అలాంటప్పుడు కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను ఎక్కడినుంచి సృష్టిస్తుందో ఆ లాజిక్కే పెద్ద జోక్.
– వెల్జాల