వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని బీరాలు పలుకుతున్న తెలంగాణ బీజేపీ నేతల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లారు. ఆయన ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తనను కలిసే అవకాశం దక్కని కార్పొరేటర్లను ఢిల్లీ పిలిపించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందని మోదీ వారిని ఆరా తీశారు. ఈసారి అధికారం మనదేనని ఇక్కడ చెప్పినట్టుగానే అక్కడ ఆయనకూ చెప్పారు.
ఏ లెక్కన అధికారంలోకి వస్తారో చెప్పండని మోదీ గుచ్చి గుచ్చి అడిగారు. టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతతో గెలుస్తామన్నారు. అంటే వ్యతిరేక ఓట్లపై ఆశ తప్ప అక్కడ మనకేం పాజిటివ్ ఓట్లు లేవనేనా దీని అర్థం అని మోదీ తిరిగి ప్రశ్నించడంతో.. ఏం చెప్పాలో తెలియక వారు ‘అంతేగా-అంతేగా?’ అంటూ నీళ్లు నములుతూ, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నట్టు వినికిడి.