రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ! నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ ముహుర్తాలను చూసుకొని ఫాలో అవుతుంటారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఫిరాయింపులోనూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారని వారి సన్నిహితులు చెబుతున్నారు. గతంలో తిరుపతి వెంకన్నను దర్శించుకున్నాకే తాను బీజేపీలో చేరబోతున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు.
అదే మాదిరిగా ఇప్పుడు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా ఇటీవల తిరుపతి వెళ్లి వెంకన్నను దర్శనం చేసుకున్నాకే పార్టీ పేరు చెప్పకపోయినా బీజేపీలో చేరనున్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. ఇక బీజేపీలో చేరేది ఎప్పుడన్నది ప్రకటించడమే తరువాయి. ఫిరాయింపులోనూ సెంటిమెంట్ అంటే ఇదే మరి!
– వెల్జాల