రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు, పథకాలతో ప్రజలను మెప్పిస్తేనే వాళ్లు ఆ పార్టీలను ఆదరించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని తెలంగాణ ప్రతిపక్షాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం శోచనీయం. కాగా, కొన్ని పార్టీలు అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తున్నాయి. అధికారం కోసం ఎంతటి కుట్రలనైనా పన్నుతున్నాయి. ఆ పార్టీల తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక త్యాగాలకు ఓర్చి నిబద్ధతతో తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ప్రజలు అవకాశం ఇచ్చి 2014లో అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అత్యం త పారదర్శకంగా, నిజాయితీగా చేపట్టింది. అసాధ్యమని భావించిన కాళేశ్వరం లాంటి భారీ నిర్మాణ పనులను కూడా రికార్డు సమయంలో పూర్తి చేసి ఆ ఫలితాలను ప్రజలకు అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అనుభవించిన వేదనను, వివక్షను రూపుమాపి నిర్లక్ష్యం చేయబడిన అనేక రంగాలను సంక్షోభం నుంచి గట్టెక్కించే విధంగా కేసీఆర్ ముందుచూపుతో అద్భుత విజయాలు సాధించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అన్నిరంగాల్లో వచ్చిన సమూల మార్పును నిత్య జీవితంలో అనుభవంలోకి వచ్చిన ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజా మద్దతును ఓర్వలేక అనేక విషయాల్లో ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
గత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నాటి ప్రతిపక్ష పార్టీలు, సమైక్య నేతలతో చేతులు కలిపి మాహాకూటమిగా ఏర్పడి కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ ప్రజల మీదున్న పూర్తి విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీచేసినా వారి డిపాజిట్లను గల్లంతు చేస్తూ 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని అజేయమైన శక్తిగా అవతరించారు.
ఆ తర్వాత జరిగిన అన్నీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నాలుగేండ్లలో కూడా కేసీఆర్ తన ముందుచూపుతో బెంచ్ మార్క్ అభివృద్ధితో తెలంగాణను అనేకరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైన సందర్భంలో కూడా తెలంగాణ తన కాళ్ల మీద తను నిలబడి ఇవ్వాళ భారత దేశ ప్రగతిలో కూడా తనదైన ముద్రను వేస్తున్నది. అన్ని రాష్ర్టాలను ప్రాంతాలను సమ దృష్టితో చూడాల్సిన కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా అనేక విషయాల్లో కొర్రీలు పెడుతున్నది. అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నది. అయినా ఏ మాత్రం వెరవకుండా తెలంగాణ తన సొంత ఆదాయం, నిధులతో ఇవ్వాళ అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచింది. దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణను అనుసరించే స్థాయికి ఎదుగుతున్నది. తెలంగాణ రాష్ర్టాభివృద్ధి కేంద్రంలోని బీజేపీ పార్టీకి కంటగింపుగా మారింది. తెలంగాణలో కేసీఆర్ను నిలువరించాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రతి సందర్భంలో కేసీఆర్ను వారి కుటుంబసభ్యులను, పార్టీ నాయకులను నిరంతరం వేధిస్తున్నది. ప్రభుత్వాన్ని బద్నాం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని బీజేపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ బీజేపీని తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా నిలువరించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వ నిరంకుశ రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి భారత రాజకీయాల్లో ఉన్న స్తబ్ధతను ఛేదించారు.
అనతికాలంలోనే తెలంగాణ సాధించిన అద్భుత విజయాలను దేశవ్యాప్తంగా చర్చకు పెట్టారు కేసీఆర్. తెలంగాణ అభివృద్ధి మాడల్ను దేశాభివృద్ధికి సూచిస్తూ, సమా ఖ్య ప్రజాస్వామిక స్ఫూర్తిని పెంపొందించే ప్రత్యామ్నాయ రాజకీయ అవసరాన్ని దేశ ప్రజల ముందుంచారు. కేసీఆర్ అభివృద్ధి, ప్రగతి కాముక విధానాలు ఇవ్వాళ దేశ ప్రజానీకాన్ని ఆలోచింపజేశాయి. దీంతో కేసీఆర్ను అణిచివేయాలనే దుర్బుద్ధితో బీజేపీ అనేక కుట్రలకు తెరలేపింది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం, ఈడీ, సీబీఐ కేసులతో వేధించడం చేస్తున్నది. అయినప్పటికీ వారి పాచికలు పారకపోవడంతో ఇవ్వాళ ప్రజల, విద్యార్థుల భవిష్యత్తును కూడా పణంగా పెట్టి మరీ తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నది.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికిపోయినట్లుగానే ఇప్పుడు ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కూడా బండి సంజయ్ నాయకత్వంలోని బీజేపీ పార్టీ రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది. రాజకీయాల కోసం పదవ తరగతి పరీక్ష రాసే పిల్లల జీవితాలతో చెలగాటమాడే చిల్లర కుట్ర ఇవ్వాళ బట్టబయలైంది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఎటువంటి దిగజారుడు చర్యలకైనా వెనుకాడరని మరోసారి రుజువు చేశారు. కేవలం మతం, కులం అనే సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, అబద్ధపు ప్రచారాలతో సోషల్ మీడియాలో ప్రజలను గందరగోళ పరచడం, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పి వేధించటం. ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడం లాంటి అప్రజాస్వామిక వ్యూహాలతో అబద్ధపు పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటున్నది.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికిపోయినట్లుగానే ఇప్పుడు ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కూడా బండి సంజయ్ నాయకత్వంలోని బీజేపీ రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది. రాజకీయాల కోసం పదవ తరగతి పరీక్ష రాసే పిల్లల జీవితాలతో చెలగాటమాడటం వారి కుత్సిత బుద్ధికి నిదర్శనం.
తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. ఎంతోమంది నియంతలను కాలగర్భంలో కలిపిన చైతన్యం తెలంగాణది. ఆత్మగౌరవం కోసం ఎంతటి త్యాగానికైనా వెరవకుండా పోరాడిన నేల ఇది. ఇంతటి చరిత్ర కలిగిన తెలంగాణను ఇటువంటి చిల్లర ప్రయత్నాలతో ఏమార్చలేరనే సత్యాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలి. ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళిక లేకుండా తెలంగాణ త్యాగాల పట్ల గానీ ఈ ప్రజల భవిష్యత్తు పట్ల గానీ ఎటువంటి బాధ్యత లేని బీజేపీ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు.
తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ నిబద్ధత, రాజకీయ చతురత, అభివృద్ధిపై ఆయనకున్న విజన్, తెలంగాణ ప్రజలపై ఉన్న అమితమైన ప్రేమ కారణంగానే కేసీఆర్ తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సం పాదించారు. ఆ స్థానాన్ని ఇటువంటి చిల్ల ర ప్రయత్నాలతో చెరిపేస్తామనుకోవటం వారి తెలివితక్కువతనానికి నిదర్శనం. అధికారమే పరమావధిగా రాజకీయ లబ్ధికోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతామంటే ఆ పార్టీలకు ప్రజలు శాశ్వత రాజకీయ సమాధిని నిర్మిస్తారు. తస్మాత్ జాగ్రత్త.
మాదాసు శ్రీనివాస్: 99891 78900