కాంగ్రెస్ మునిగిపోయే పడవ. అయినా ఆ పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే ఆపబోం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ఈటల, కోమటిరెడ్డి దూరంగా ఉండటంపై వారిని కొందరు నేతలు ఆరా తీయగా, బండిని మార్చకుండా ఇంటింటికి తిరిగినా ఫలితం లేదనే పాల్గొనడం లేదని అన్నట్టు సమాచారం. మొత్తం మీద బండి, ఆయన వ్యతిరేక వర్గం రెండూ కూడా బీజేపీకి భవిష్యత్ లేదని తేల్చేశాయి. అందుకే కాబోలు పార్టీ మారుతామనే వారిని ఆపబోమన్న బండి సంజయ్, తాను కూడా బిస్తర్ సర్దుకొని రెడీగా ఉన్నట్టు చెప్పడం వెనుక అసలు మతలబు ఇదీ.