ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి తొమ్మిది ఏండ్లుదాటి పదవ ఏట అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మూడు వారాలు ముచ్చటైన సంబురాలు జరుపుకున్నాం. తెలంగాణ అమరుల త్యాగాలు వృథా కాలేదని ఆత్మసాక్షిగా నివాళులు అర్పించుకున్నాం. అభివృద్ధిలో పదేండ్ల ప్రస్థానం విజయ వంతంగా సాగిన సందర్భంగా జరుపుకుంటున్న సంబురాలివి.
ఈ సంబురాలకు మరో విశిష్ఠత కూడా ఉన్నది. అది- దేశాన్ని ‘తెలంగాణ మాడల్’లో తీర్చిదిద్దడానికి విజయయాత్ర ప్రా రంభమైన సందర్భంగా జరుగుతున్న సంబురాలివి. విజయుడు కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశంలోని దుష్ట శక్తులపై తన గాండీవాన్ని ఎక్కుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రజ లు జరుపుకుంటున్న సంబురాలు ఇవి.
అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేధ స్సు ఉన్న నాయకుడు కేసీఆర్. కాబట్టే, తెలంగాణకు పటిష్టమైన పునాది ఏర్పరిచేందుకు పగలూ రేయీ కష్టిస్తున్నారు మన కేసీఆర్. పరాయి పాలనలో ఆరు దశాబ్దాలకు పైగా కునారిల్లిన రాష్ట్రం కోలుకునేందుకు తొమ్మిది ఏండ్ల కాలం సుదీర్ఘమైనదేమి కాదు, అయితే ఈ పునాది అత్యంత పటిష్టమైనది. ఆకాశ సౌధానికి అంకురమైనది. పట్టెడన్నం-పిడికెడు ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ సారథి పాలకుడైన తర్వాత రెండింటికి పూచీ పడ్డారు. తడారి పోయి న నేల తల్లి ఎడారిగా మిగలడం ఇష్టం లేక సాగునీరు – తాగు నీటిపై మొదటగా దృష్టి సారించా రు, అపర భగీరథుడుగా అవతారమెత్తారు. అ కుంఠిత దీక్షతో అడుగు ముందుకు వేశారు. ఫలితమే కాళేశ్వరం. తెలంగాణ రైతన్నలపై కేసీఆర్కున్న తరగని మమకారానికి తిరుగులేని సాక్ష్యం.
దేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా రెండు పంటలకు గాను ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అలాగే, ఏ కారణం చేతైనా రైతన్న మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానంగా చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణాలో చెరువుల పునరుద్ధణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఊర చెరువునూ జల సిరులతో నింపారు.
కరెంటు కోసం రైతన్నలు పడుతున్న అష్టకష్టాలు తీర్చేందుకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర కరెంటును అందిస్తున్నారు. అలాగే, ఆడ బిడ్డలు తాగు నీటి కోసం పడుతున్న కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తూ ప్రజల దూప తీర్చిండు. మొత్తంగా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ నిమగ్నమయ్యారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరుకున్నది. ఒకప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండి అనేక ప్రయోగాలు చేసి, అద్భుతాలు సృష్టించిన కేసీఆర్ తెలంగాణ సాధించడంపై దృష్టిసారించి విజయం సాధించారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ దేశ పరిస్థితి పట్ల ఆవేదన చెందుతున్నారు. ‘మనదేశానికి ఉన్న లక్ష్యం ఏంటి?’ అంటూ కేసీఆర్ వేసిన ప్రశ్న దేశంలోని మేధావులను కదిలించింది. మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది.
దేశంలో ఎంత వ్యవసాయ యోగ్యమైన భూ మి ఉన్నది, ఎన్ని టీఎంసీల నీటి లభ్యత ఉన్నది కేసీఆర్ లెక్కలతో సహా చెప్పి పరిష్కారాలు చూప డం రైతన్నలను, రైతు ఉద్యమ సంస్థలను ఆలోచింప జేస్తున్నది. మరోవైపు ప్రతిపక్షాలను ఏకం చేయడం కన్నా తానే సొంత అజెండాతో దేశ ప్ర జల మధ్యకు వెళ్లడం మంచిదని ఆలోచించిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చా రు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు దేశమంతా మారు మోగుతున్నది.
కేసీఆర్ తెలుగులో ప్రజల భాషలో మాట్లాడి మెప్పించారు. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో దేశ సమస్యలపై మాట్లాడి మెప్పించగలరు. దీంతో రైతన్నల రాజ్యం కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఆసేతు హిమాచలం ప్రతిధ్వనిస్తున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మొదలుకొని అనేక రాష్ర్టాల నుంచి నాయకులు, రైతులు కేసీఆర్ నాయకత్వంలోని ఈ మహోద్యమంలో వచ్చి చేరుతున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుందనేది ప్రధానం కాదనీ, ప్రజలు గెలువాలని కేసీఆర్ అంటున్నా రు. దేశంలో బీఆర్ఎస్ సంచలనం సృష్టిస్తున్నదనడంలో సందేహం లేదు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి 1977లో జనతా పార్టీ మాదిరిగా బీఆర్ఎస్ మహోద్యమంగా మారబోతున్నది. కేసీఆర్ ఏ ప్రతిపక్ష నేత మీదా నమ్మకం పెట్టుకొని ముం దుకు పోవడం లేదు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఒక్కడే, కానీ ఆ తరువాత కోట్లాది జనం ఆయన వెంట నడిచారు. ఇప్పుడూ అంతే. దేశవ్యాప్తంగా జనాన్ని కదిలించబోతున్నారు.
లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెం బ్లీ ఎన్నికలలో కేసీఆర్ను దెబ్బకొట్టాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణకు వ్యతిరేకమైనవే.
దేశాన్ని డెబ్బయేండ్ల పాటు వెనుకబడేయడంలో ఈ రెండు పార్టీల పాత్ర ఉన్నది. బీఆర్ఎస్ తెచ్చే మార్పును ఇవి అంగీకరించలేవు. అందువల్ల ఈ రెండు పార్టీలు కేసీఆర్ను దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టాన్ని ఏ మాత్రం ఆదుకోని ఈ రెండు పార్టీలు కేసీఆర్ను రాష్ట్రంలో దెబ్బతీయడం ద్వారా జాతీయ స్థాయిలో ఎదగకుండా చేయాలని కుట్రపన్నుతున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్నే కాదు, దేశ సౌభాగ్యానికి సంబంధించినవి. భాగ్యవంతమైన భారతాన్ని నిర్మించడానికి తోవచూపేవి. అందుకని తెలంగాణ ప్రజలు కేసీఆర్కు అండగా నిలువాలి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్కు సంపూర్ణ విజయం కట్టబెట్టాలి. దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు కేసీఆర్ తప్ప మరెవరూ ఉండరు. ప్రతి పేదవాడి కన్నీళ్లు తుడవడమే కేసీఆర్ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో కేసీఆర్కు తెలంగాణ ప్రజలు సహకరించాలి.
దేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా రెండు పంటలకు గాను ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అలాగే, ఏ కారణం చేతైనా రైతన్న మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.