ఆకాశానికి ఎగబాకిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బహుమానంగా వచ్చాయి. దేశంలో 12 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయంటే దేశ ప్రగతి పురోగమిస్తున్నాదా? తిరోగమిస్తున్నాదా? మేధావులే ఆలోచించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు ‘మేధావి మౌనం దేశానికి ప్రమాదం’ అన్న వాస్తవాన్ని గుర్తించాలి.
2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ మాడల్ను భూతద్దంలో చూపించారు.‘నాకు ఓటేయ్యండి దేశ స్థితిగతులను మారుస్తా. నల్లధనాన్ని ప్రతి పేదవారి ఖాతాలో వేస్తా’ అని ప్రజలను నమ్మబలికారు. యువతకు ఉద్యోగాలు, రైతుల జీవితాల్లో మార్పు, దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతానని అబద్ధాలు, అసత్యాలు పలికారు. ఇది నిజమని నమ్మిన జనం 2014లో బీజేపీకి అధికారం కట్టబెట్టారు. కానీ ప్రజల ఆశల మీద మోదీ నీళ్లు చల్లారు.
దేశ సంపద ప్రజల సుస్థిరాభివృద్ధికి బాట లు వేసేదిగా ఉండాలి. కానీ, మోదీ పాలనలో కార్పొరేట్ గద్దలకు పంచి దానికి ‘రాయితీలు’ అని అందమైన పేరు పెట్టారు. ఓ వైపు పేదలకు ఉచితాలు వద్దంటూ, మరోవైపు కార్పొరేట్ వర్గాలకు రూ.9 లక్షల కోట్ల జనం సొమ్మును ధారదత్తం చేశారు.
ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం 55 నుంచి 107వ స్థానానికి దిగజారింది. మీడి యాస్వేచ్ఛలో 140 నుంచి 150కి, చట్టబద్ధ పాలనలో 35 నుంచి 77కు, ప్రజాస్వామ్య సూచికలో 27 నుంచి 46కు చేరింది. వివిధ కీలక రంగాల్లో భారతదేశం ఎలా పతనమవు తున్నదో ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ సంపద కొల్లగొట్టి, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు ఎగ్గొట్టి నీరవ్మోదీ లాంటివారు రాచమార్గంలో ఇతర దేశాలకు వెళ్లిపోయా రు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తీసుకురావటం దేవుడెరుగు, మోదీజీ సూటు, బూటు మిత్రులు గతంలో కంటే ఇప్పుడు విదేశీ ఖాతాల్లో ఎక్కువ సంపదను దాచుకుంటున్నారు. మనతో పోలిస్తే చిన్న
దేశాలెన్నో అభివృద్ధిలో దూసుకుపోతున్నా యి. మోదీ పాలన ఇలా ఉంటే, తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే నెం బర్ వన్గా ఉంటూ దేశానికి రోల్మాడల్గా నిలవడం వెనుక కేసీఆర్ రాజనీతిజ్ఞత, చిత్తశుద్ధి, దార్శనికతలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు సమ యంలో పూర్తిచేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నారు. నవయుగ అశోకుడిలా హరితహారం పేరుతో మొక్కలు నాటుతూ, కాకతీయ చక్రవర్తిలా మిషన్ కాకతీయ పేరుతో పూడుకుపోయిన చెరువులను తవ్వించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారు. ఆడపిల్ల పెండ్లి పేద కుటుంబానికి భారం కావొద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప మనసు ముఖ్యమంత్రి కేసీఆర్ది. దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా తెలంగాణలో 12 రకాల ఆసరా పింఛన్లు ప్రజలకు అందుతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో రైతుల గురించి కేసీఆర్లా ఆలోచిం చిన నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చూశాం. కానీ, కేసీఆర్ చరిత్రను తిరగరాసి రైతును రాజును చేయ సంకల్పించారు. 21వ శతాబ్దంలో వ్యవసాయ విప్లవం అంటే ఏమి టో ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. రైతుబంధు, ఉచిత నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటివి కేసీఆర్తోనే సాధ్యమయ్యాయి.
ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కా రు దవాఖాన’కు అని పాడుకున్న దవాఖానలకు కేసీఆర్ కొత్త రూపం తీసుకొచ్చారు. ఆధునిక వసతులతో నేడు ప్రభుత్వ దవాఖానలు ప్రైవే టు దవాఖానలతో పోటీ పడుతున్నాయి. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రీషన్తో తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, కంటివెలుగు, డయాలసిస్, డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటు, బస్తీ, పల్లె దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాలలు ఇలా ఎన్నెన్నో అమల్లోకి తీసుకొచ్చారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రామ పంచాయతీలు గా గిరిజన తండాలు, బీసీ ఆత్మగౌరవ భవనాలు, దళితబంధు ఇలా.. తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకొంటూ పోతే ఒడువని ముచ్చటే. అందుకే ‘దేశ్ కీ నేత కేసీఆర్’ కోసం దేశం ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు): డాక్టర్ కరాటే రాజు నాయక్