వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ విద్యుత్ వాహనాల తయారీలో, వాటికి ఉపయోగించే పునర్వినియోగ బ్యాటరీ తయారీలో కనిపించని పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది. పునర్వినియోగ బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల మైనింగ్, పర్యావరణ, సామాజిక సమస్యలకు దారితీస్తుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) నివేదిక పేర్కొన్నది.
విద్యుత్ వాహనాలు పొగ, కార్బన్ డయాక్సైడ్ ఇతర గ్రీన్హౌజ్ వాయువులను విడుదల చేయకపోవడం వల్ల వీటిని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవిగా భావిస్తారు. ప్రస్తుత వాతావరణ విధానాల ప్రకా రం, ఎలక్ట్రిక్ వాహనాలు 2030 నాటికి రోజు కు 20 లక్షల బ్యారెళ్ల కంటే ఎక్కువ డీజిల్, పెట్రోల్ అవసరాన్ని తగ్గించగలవు.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారం 2030 నాటికి విద్యుత్ వాహనాల సంఖ్య 2.3 కోట్లకు పెరుగుతుందని అంచనా. కానీ విద్యుత్ వాహనాల తయారీలో, వాటికి ఉపయోగించే పునర్వినియోగ బ్యాటరీ తయారీలో కనిపించని పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది. పునర్వినియోగ బ్యాటరీ తయారీ లో ఉపయోగించే ముడి పదార్థాల మైనింగ్, పర్యావరణ, సామాజిక సమస్యలకు దారితీస్తుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) నివేదిక పేర్కొన్నది. ఈ బ్యాటరీల్లో వాడే లిథియాన్ని వాణిజ్య పద్ధతిలో ఎక్కువగా భూగర్భ ఉప్పు నీటి రిజర్వాయర్ల నుంచి సేకరిస్తారు. ఉప్పు నీటిని భూమి పైకి పంపు చేసి, బాష్పీభవన చెరువుల్లో కొన్ని నెలలపాటు నిల్వ ఉంచుతారు. సూర్యరశ్మి వల్ల ఆ నీరంతా ఆవిరై చివరికి లిథియం, వివిధ రకాల లవణాలు అవక్షేపించబడతాయి. ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో తీవ్రమైన భూ కాలుష్యం, ఇతర కాలుష్యాలు ఏర్ప డుతాయి. చిలీలోని సలార్ డి అటాకామాలో లిథియం, ఇతర మైనింగ్ కార్యకలాపాలకు 65 శాతం నీటిని వినియోగించుకోవడం వల్ల భూగర్భ జలాలు క్షీణించి నీటికొరత ఏర్పడింది. నేల కాలుష్యం, ఇతర పర్యావరణ సమస్యల కారణంగా స్థానికులు తమ నివాసాలను ఖాళీచేసి వదిలి వెళ్లాల్సి వచ్చింది.
లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉపయోగించే మరో ప్రధాన ముడి పదార్థం కోబాల్ట్. ఒక బ్యాటరీకి సుమారు 4-30 కేజీల కోబాల్ట్ను వినియోగిస్తారు. ప్రపంచంలో 70 శాతం కోబాల్ట్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో లభ్యమవుతుంది. ఆ దేశంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా కోబాల్ట్ తవ్వి తీసి తక్కువ ధరకే కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ గనుల తవ్వకంలో 40 వేల మంది బాలకార్మికులు చేతులకు ఎలాంటి తొడుగులు లేకుండా ఆక్సిజన్ తక్కువగా ఉండే లోతైన గనుల్లో గంటల కొద్దీ పని చేస్తారు. తవ్వి వదిలేసిన కోబాల్ట్ గనుల నుం చి సల్ఫర్ విడుదలై వాతావరణంలోని నీటితో కలిసి ఆమ్లవర్షం కురిసే అవకాశాలున్నాయి. ఆసిడ్ మైన్ డ్రైనేజ్ అని పిలిచే ఈ ప్రక్రియ నదుల ప్రవాహాలను, జలచరాలను, తాగే నీటి ని కలుషితం చేస్తుంది. కోబాల్ట్ తవ్వకాల నుం చి వచ్చే ధూళిలో యురేనియం వంటి విషపూరిత లోహాలు ఉండి గాలి కాలుష్యం జరుగుతుంది. ఈ కాలుష్యం వల్ల దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులు, పుట్టుక లోపాలు కలుగుతాయి.
లిథియం అయాన్ బ్యాటరీలలో వాడే గ్రాఫైట్ తవ్వకాల వల్ల కూడా పర్యావరణానికి హాని కలుగుతున్నది. గ్రాఫైట్ గనుల తవ్వకంలో వాడే పేలుడు పదార్థాలు వాతావరణంలోకి దుమ్ము, ధూళి, సూక్ష్మ కణాలను విడుదల చేసి గాలి, నేల కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఖనిజాల వెలికితీత 90 శాతం జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తుంది. కార్బన్ ఉద్గారాల విడుదలకు కారణమవుతాయి. గనుల తవ్వకంలో భాగంగా అడవులు నరికేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. మైనింగ్రంగం ప్రతి సంవత్సరం 100 వేల కోట్ల టన్ను ల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నదని ఒక అంచనా. మైనిం గ్ ప్రక్రియ అధిక విద్యుత్ను వినియోగించుకోవడంతో పాటు జల కాలు ష్యం, నేల కాలుష్యం, వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయి. వాడి పారేసిన బ్యాటరీల్లో విష పూరితమైన రసాయనాలు ఉండటం వల్ల భూ కాలుష్యం జరుగుతున్నది.
2030 నాటికి సుమారు 1.28 కోట్ల టన్ను ల లిథియం అయాన్ బ్యాటరీలు పనికిరాకుం డా పోయే పరిస్థితి ఉంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) ప్రకారం లిథియం-అయాన్ బ్యాటరీలు కలిగి ఉన్న పరికరాలను చెత్త లేదా రీ సైక్లింగ్ డబ్బాల్లో ఇతర వ్యర్థాలతో కలిపి పారేయకూడదు. ఇలా చేస్తే వాటిని రవాణా చేసే సమయంలో లేదా వాటిని పడేసే ప్రదేశంలో మంటలు ఏర్పడే అవకాశం ఉన్నది. వీటిని ధ్రువీకరించిన బ్యాటరీ రీ సైక్లర్కు లేదా గృహ ప్రమాదకర వ్యర్థాల సేకరణ పాయింట్లకు అందజేయాలి.
విద్యుత్ వాహనాలను పూర్తి పర్యావరణ అనుకూలంగా మార్చడం ఎలా? యూఎన్సీటీఏడీ నివేదిక సిఫారసుల ప్రకారం…
1. పర్యావరణ అనుకూల మైనింగ్ పద్ధతులు అవలంబించాలి. ఉపయోగించిన లిథియం అయాన్ బ్యాటరీలను మరింత సమర్థంగా రీ సైకిల్ చేయగల సాంకేతికతను అభివృద్ధి చేయాలి.
2. పర్యావరణానికి హాని కలుగని పద్ధతుల్లో లభించే ముడి పదార్థాలను బ్యాటరీ తయారీకి వాడటం. ఉదాహరణకు మైనింగ్ ద్వారా లభించే గ్రాఫైట్ స్థానంలో సులభంగా లభించే సిలికాన్ను బ్యాటరీల తయారీలో వాడే అంశాన్ని పరిశీలించాలి.
3. అత్యధిక సంఖ్యలో చార్జ్, డిశ్చార్జ్ సైకిల్స్ ను కలిగిన పునర్వినియోగ బ్యాటరీలను తయారుచేయాలి.
4. పనిచేయడం మానేసిన పునర్వినియోగ బ్యాటరీల ముడి పదార్థాలను వేరే అవసరాలకు ఉపయోగించుకోవాలి.
5. హైడ్రోజన్-ఆక్సిజన్ ఇంధన ఘటంతో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.
పర్యావరణానికి హాని కలుగని పద్ధతుల్లో లభించే ముడి పదార్థాలను బ్యాటరీ తయారీకి వాడటం. ఉదాహరణకు మైనింగ్ ద్వారా లభించే గ్రాఫైట్ స్థానంలో సులభంగా లభించే సిలికాన్ను
బ్యాటరీల తయారీలో వాడే అంశాన్ని పరిశీలించాలి… అత్యధిక సంఖ్యలో చార్జ్, డిశ్చార్జ్
సైకిల్స్ను కలిగిన పునర్వినియోగ బ్యాటరీలను తయారుచేయాలి.
(వ్యాసకర్త: రసాయన
పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్)
శ్రీదరాల రాము: 94411 84667