దశాబ్దాల పోరాటం, అనన్య త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముం దుకు తీసుకుపోతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే మేధావులు, వివిధ రంగాల నిపుణులతో కేసీఆర్ రోజుల తరబడి చర్చలు చేశారు. ఉద్యమ సారథిగా తన అనుభవంలోకి వచ్చిన అంశాల ఆధారంగా కొత్త రాష్ట్రంలో ఎన్నో పథకాలను రూపొందించారు. అంతేకాదు, అమలు చేస్తూ వస్తున్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ లాంటి ఎన్నో ప్రజోపయోగ పథకాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ నేపథ్యంలోనే ‘దళిత్ ఎంపవర్మెంట్ పథ కం’ కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎలా ఉండబోతున్నది? దానిద్వారా దళితుల ఆర్థిక అభివృద్ధి ఎలా జరగబోతున్నదనే విషయాలను కేసీఆర్ వివరించారు. ఈ పథకానికి ‘దళిత బంధు’ అని పేరు పెట్టి, పైలట్ ప్రాజె క్టుగా హుజూరాబాద్లో అమలు చేశారు.
రాష్ట్రంలో గొల్లకుర్మలకు- గొర్లు, ముదిరా జ్, గంగపుత్రులకు- చేపపిల్లల పంపిణీ పథకం అమల వుతున్న ది. చేనేత తోడ్పాటు కోసం పథకాలు రూపొందించి అమలుచేస్తున్నది. వివిధ కులవృత్తుల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఎన్నికల కోసమే అన్నట్టు ప్రతిపక్షాలు కువిమర్శలు చేయటం హేయనీ యం. ‘దళిత బంధు’పై కూడా ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎంత మం చి ఉన్నా ఎన్నడూ హర్షం వ్యక్తం చేయనివాళ్లు, ఇప్పుడు తమ పునాదులు కదిలిపోతాయనే భయంతో గగ్గోలు పెడుతున్నారు. ‘దళితబంధు’పై ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరం.
కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ‘దళిత చైతన్య జ్యోతి’ కార్యక్రమాన్ని దుబ్బాకలోని ఎల్లాపూర్ గ్రామంలో అమలుచేశారు. అక్కడి దళితులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకున్నారు. సేద్యం కోసం బావులు తవ్వించారు. దళితులను వ్యవసాయదారులు గా మార్చారు. తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషిచేశారు. ఈ విధంగా ‘దళిత బంధు’ పథకానికి దాదాపు 23 ఏండ్ల కిందటే బీజం పడింది. ప్రస్తుత ఉపాధి అవకాశాలు, జీవన విధానం, ఆర్థిక అం శాలను పరిగణనలోకి తీసుకుని ‘దళితబంధు’ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల మూలధనం దళితులను శ్రీమంతులుగా చేస్తుంది.
దళితుల విషయంలో గత ప్రభుత్వాలే కాదు, దేశం లోని ఏ ప్రభుత్వం చేయనంత చిత్తశుద్ధితో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అయినా ప్రతిపక్షాలు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. ఎన్నికలప్పుడు పథకాలు ప్రకటించి ఆ తర్వాత చేతులు దులుపుకొనే అలవాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది. ఎన్నికలున్న రాష్ర్టాల్లో ప్యాకే జీలు ప్రకటించిన ప్రధాని మోదీ ఎన్నికలు అయిపో యాక ఎలా మోసం చేశారో బీజేపీ నేతలకు తెలియదా? బీహార్ ఎన్నికలప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ఏమైంది? పొరుగు రాష్ట్రం ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరాయో బీజేపీ సమాధానం చెప్పా లి. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కితెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని 2014 లో మోదీ ఇచ్చిన హామీ ఏమైందో బీజేపీ నేతలు చెప్పా లి. పథకాలు, హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీది నిలకడలేని విధానం. మ్యానిఫెస్టోలో ప్రకటించని పథకాలను అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ‘దళితబంధు’ విషయంలో దాన్ని విజయవంతం చేయ టం కోసం తమ వంతు సలహాలు, సూచనలు చేయలేని, మంచిని కూడా ఆహ్వానించలేని ప్రతిపక్షం ఎందు కు? ఈ మాత్రం ప్రజలకు తెలియదా?
వ్యాసకర్త: టీఆర్ఎస్ నేత, గ్రేటర్ వరంగల్
సతీశ్ కుమార్ నూటెంకి