పాదాలు పట్టుకొని
పదవుల కొచ్చిన వారు
నోరదుపులేని నాయకులు
ప్రజాస్వామ్యం మరిచి
పెత్తందారీ భావన రక్తం
నిండుగా ఉండగా
చెప్పుతోనే కొడతారు!
అబద్ధాలతోనే అధికారంలోకి
వచ్చామనే మీరు
ఆరు గ్యారంటీలకు
వందరోజుల సమయమడిగినా
ఆగి, అడిగిన
రైతులను మీరు
చెప్పుతోనే కొడతారు!
చెప్పంటే పాదరక్ష కదా!
ఈ విధంగా రైతులను
సన్మానిస్తారు!
ఉచితాలకు ఉలుకు
పలుకు లేక మిమ్మల్ని
గెలిపించినందుకు
చెప్పుతోనే కొడతారు!
వాళ్లు రైతులు
తిరగబడితే
మీ మాట మీకు
ఓట్ల ద్వారా చెల్లిస్తారు!
జై కిసాన్లు వారు
మీకు మూల్యం వడ్డీతో
వడ్డిస్తారు!
కాస్త కాలమే మధ్యలో..
– డా.గన్నోజు శ్రీనివాసాచారి 85558 99493