కేసీఆర్ గొంతెత్తితే ప్రతిపక్ష పార్టీల్లో భూకంపమే. వ్యూహనికే నడక నేర్పిన వ్యూహకర్త కేసీఆర్. ప్రతిపక్షాలు ఎన్ని పద్మవ్యూహాలతో వచ్చినా వాటిని ఛేదించే మహా ఉద్యమ వ్యూహం ఆయనకు ఉంటుంది. మొండికి జగమొండిలా భీకరపోరుకు సిద్ధం అంటూ సవాల్ విసిరే తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్. గత రెండు ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి అక్కడినుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
బతుకమ్మ పండుగ రోజు తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో, విజయదశమి రోజున జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు దించుతుండు కేసీఆర్. ఇక కాసుకోండి. అమ్ముల పొదిలో నుంచి వచ్చే తెలంగాణ యోధుని బాణం కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో దిగటం ఖాయం. భారత రాష్ట్ర సమితి విజయాధినేత దూసుకు వస్తున్నడు. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. దీపావళి రోజు ప్రతిపక్ష నరకాసురుల భరతం పట్టి, కార్తీక మాసం కోటి కాంతుల వెలుగుల్లో నాలుగు కోట్ల జనం సాక్షిగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేది కేసీఆరే.
నాడు తెలంగాణ ఉద్యమంలో తన మేధోసంపత్తిని పాయలుగా విభజించి ఎత్తులకుపై ఎత్తుల వ్యూహంతో తెలంగాణకు అడ్డుపడే దుష్టశక్తులను తుదముట్టించిన యుద్ధ వీరుడు కేసీఆర్. లేకుంటే ఉమ్మడి రాష్ట్ర దోపిడీదారుల నుంచి తెలంగాణ విముక్తి అయ్యేదా? కేసీఆర్ ఉద్యమం ప్రపంచానికి మార్గదర్శకం. ఎన్నో త్యాగాలు, కేసీఆర్ అకుంఠిత దీక్షతో ముక్కోటి తెలంగాణ జనమంతా ఒక్కటైన చేతనం. సీఎం కేసీఆర్ నేటి ఉజ్వల బంగారు తెలంగాణకు నిదర్శ నం. పోరాట స్ఫూర్తితో తెలంగాణ తెచ్చారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజల నిండైన దీవెనలతో పదేండ్లుగా తెలంగాణను బంగారు తునకలా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది.
ఆ ఒక్క గొంతు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది. అందు కే కేసీఆర్ గొంతు తెలంగాణ ఊపిరి. కేసీఆర్ గొంతు తెలంగాణ ఉద్యమ గర్జన. ఆ గొంతు వింటే ధైర్యం. ఆ గొంతు వింటూంటే మస్తిష్కం పునరుత్తేజం అవుతుంది. ఆ గొంతు సింహగర్జన చేస్తుంటే నరనరాల్లో రక్తం ఉరుకలేసి ప్రవహిస్తుంది. ఆ గొంతు స్వచ్ఛమైన ప్రేమను ఆప్యాయతను పంచుతుంది. ఆ గొంతు మరోసారి హుస్నా బాద్ వేదికగా గర్జించనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ గత ఆగస్టు నెల 21న 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయి. పదేండ్ల ప్రగతి పథం నేటి ఎన్నికల నినా దం. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రతి ఇంటికి చేరాయి.మళ్ళీ సీఎం కేసీఆర్ సార్ రావాలని తెలంగాణ ప్రజలు బలం గా కోరుకుంటున్నారు. అరవై యేండ్ల పరాయి పాలనకు పదేండ్ల కేసీఆర్ పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించారు. పదేండ్లలో సాధించిన ప్రగతి వందేండ్లకు సరిపోయేలా తీర్చిదిద్దిన తీరు ను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఉమ్మడి పాలనలో సాధ్యం కాని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడి ఎత్తిపోతల పథకాలు పూర్తి కావటంతో రైతులు ఆనందంతో ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, దిశానిర్దేశంతో గడచిన 20 రోజు లుగా విరామం లేకుండా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలు చుట్టేశారు.తమ వాగ్ధ్దాటితో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అంతట గులాబీ పవనాలు వీస్తున్నాయి. ఎక్కడ చూసినా కారు స్పీడు గులాబీ హోరు కనిపిస్తు న్నది. ప్రతి పక్ష పార్టీలకు అందనంత దూరంలో బీఆర్ఎస్ దూసుక పోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల వాతావరణం వేడేక్కిస్తున్నారు.
కేసీఆర్ ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ, షా, రాహుల్, సంజయ్, రేవంత్, అరవింద్, అరుణ, షర్మిలా ఇలా రాజకీయ నాయకులందరికీ కేసీఆర్ ను తలుచుకోకుంటే పూట గడవదు. వాళ్లందరిదీ రాజకీయ అజెండా. కానీ కేసీఆర్ది ప్రజల అజెం డా. ప్రజల సంక్షేమం కోసమే ఆయన నిరంతరం కృషి చేస్తారు. ఏదైనా పథకం ప్రవేశ పెట్టే ముందు అనేకసార్లు అధ్యయనం చేస్తారు. ఏ పథకమైనా, ప్రాజెక్ట్ ఐనా అందులో ఉండే సాధకబాధకాలు, అవసరమయ్యే నిధులు, వాటి అమలు తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమలు చేస్తారు. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఆదివారం ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు, జీవితాలకు దగ్గరగా ఉంటుంది. రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీనవర్గాలకు కోసం కేసీఆర్ చారిత్రాత్మక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించబోతున్నారు.
హుస్నాబాద్ గడ్డమీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి సభ ఉండబోతున్నది. 2014, 2018లో ఇక్కడి నుండే ఎన్నికల ప్రచారం మొద లు పెట్టారు. రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పడు అదే సెంట్మెంట్ను కొనసాగిస్తూ మూడోసారి విజయ దుందుభి మోగించడం కోసం మరోసారి అక్కడి నుంచే తన ఎన్ని కల ప్రచారాన్ని ప్రారంభిస్తునారు. తొలిసభతో పాటు వరుసగా 17 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తం గా కేసీఆర్ పర్యటించనున్నారు.