ఏడుపును మాత్రమే ఇష్టపడే మానసిక దౌర్భాగ్యులు మన మధ్యే ఉంటారు. పచ్చని బతుకులు నచ్చని నైజాన్ని మోస్తూనే ఉంటారు. గెలికి చూడటం తప్ప, గెలిపించే గుణం జన్మలో అలవడనివారికి అరుపులే అలవాటు. చుట్టూతా పరుచుకున్న, పెరుగుతున్న పురోగతిని గమనంలోకి తీసుకోకుండా, పిచ్చి ప్రేలాపనలు పేర్చుకుంటూ పరవశిస్తుంటారు. రాష్ట్రంలో ఇలాంటి గుప్పెడు మంది మరుగుజ్జులే, ప్రగతిశీల మార్పుపై విషం కుమ్మరించే వికృత ఎజెండాను భుజాన మోస్తూ ఊరేగుతున్నారు. గాయాల గతాన్ని దాటుకొని, గెలుచుకున్న జీవితాన్ని సుస్థిరం చేసుకుంటున్న తెలంగాణను లోతైన దృక్పథంతో అర్థం చేసుకోవాలి కదా? వివేకం లేని మాటలు, విశ్లేషణ లేని రాతలు ప్రజల భవితకు ఏం ఒరగబెడతాయని?
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధికి కొలమానాలు తిరగరాయబడ్డాయి. ప్రభు త్వ లక్ష్యాల ఎంపికలో పథకాల రూపకల్పన, అమలు లో సీఎం కేసీఆర్ ప్రాణం పెట్టడం వల్లనే స్వరాష్ట్రం సవాలక్ష సవాళ్ళను అధిగమించగలిగింది. పాలనా చూపునకు కొత్త దృక్పథాన్ని ముఖ్యమంత్రి కల్పించడం వల్లనే నూతన రాష్ట్రం అద్భుతమైన ఫలితాలను సాధించగలిగింది. తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశానికి ఆదర్శంగా మలచడానికి నిరంతరం సీఎం కేసీఆర్ పడిన సంఘర్షణ వల్లనే, నేడు ఎవరి అంచనాలకు అందని ఫలితాలను రాష్ట్రం సాధించగలిగింది. దానివెనుక పాలకుడు పడ్డ శ్రమ ఎంత ఉంటుందో బుద్ధి ఉన్న వాళ్లెవరైనా అర్థం చేసుకోగలగాలి.
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.2.75 లక్షలకు పెరిగిందని, జీఎస్డీపీ రూ.4.51లక్షల నుంచి 11.48 లక్షల కోట్లకు పెరిగిందని, రెట్టింపుకు మించిన అభివృద్ధిని నమోదు చేసిందని నిర్ధారించింది ఆర్బీఐనే కదా! గ్రామీణ తెలంగా ణ ప్రజల బ్యాంకు ఖాతాల నిధులు 2015-16 సం వత్సరంలో రూ.10,700 కోట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.20,712 కోట్లకు చేరుకున్నాయంటే, రెట్టింపు వృద్ధిరేటు జరిగినట్లే కదా! తలసరి విద్యుత్ విషయంలో జాతీయ సగటు 21.08 శాతం ఉంటే, తెలంగాణలో 65.35 శాతం ఉన్నది.
కేసీఆర్కే గనుక జనరాశుల జీవితాలను మెరుగుపరచాలనే తపన లేకుంటే, నొప్పులు లేని, రాని నేలను నిజం చేయాలనే ఆశయం కొరవడి ఉంటే, భావితరానికి బంగారు బతుకులు అందివ్వాలనే మానవీయ దృష్టికోణం ఉండకపోయి ఉంటే తెలంగాణ నేడు ఇన్ని విజయాలు సాధించగలిగి ఉండేదా? ఈ సత్యాలను అర్థం చేసుకోకుండానే, నరం లేని నాలుకలు ఇష్టారీతిన మొరుగుతుంటే, ప్రగతి కాముకుల గుండెలు మండుతున్నాయి.
రాజకీయ లెక్కల కంటే రాష్ట్ర ప్రగతిని గుండెల నిండా మోస్తున్న ముఖ్యమంత్రే లేకుంటే ఇదంతా సాధ్యమా? తెలంగాణలో ఉత్పాదక, నిర్మాణ, బ్యాంకి ంగ్, సామాజిక, సేవారంగాలతో పాటు ఎనభై శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగంలోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గణాంక సంస్థల లెక్కలే నిర్ధారించాయి. వీటన్నింటినీ సాధించడంలో సీఎం కేసీఆర్ శ్రమ ఎంతుంటుందో బుద్ధిజీవులెవరైనా ఊహించకుండా ఉండలేరు కదా!
కేసీఆర్కే గనుక జనరాశుల జీవితాలను మెరుగుపరచాలనే తపన లేకుంటే, నొప్పులు లేని, రాని నేలను నిజం చేయాలనే ఆశయం కొరవడి ఉంటే, భావితరానికి బంగారు బతుకులు అందివ్వాలనే మానవీయ దృష్టికోణం ఉండకుంటే తెలంగాణ నేడు ఇన్ని విజయా లు సాధించగలిగి ఉండేదా? ఈ సత్యాలను అర్థం చేసుకోకుండానే, నరంలేని నాలుకలు ఇష్టారీతిన మొరుగుతుంటే, ప్రగతి కాముకుల గుండెలు మండుతున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కార్ డ్రైవర్లయిన మోదీ-షాల సొంత రాష్ట్రంలో గడిచిన ఏడేండ్లలో వివిధ పోటీ పరీక్షల పేపర్లు ఎనిమిది సార్లు లీకై పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో నిరుద్యోగులు రోడ్డున పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా కళ్ళున్నా ఈ కమల కబోదులు ఇదంతా చూడటం లేదు. ఆ రాష్ట్రం లో అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్ప్రెస్ వే తదితర ప్రాజెక్టుల పేరిట వేలాది, లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నా, అకాల వర్షాలకు వేలాది ఎకరాల పంట నష్టం జరిగినా, ఆదుకునే నాథుడు కరువై గుజరాతీయులు గుండెలు బాదుకుంటున్నారు. దీనికితోడు కల్తీ మద్యం కాటుకు, వంతెనలు కుప్పకూలి వందలాది గుజరాత్ జనం చస్తున్నా మోదీ జపం చేస్తున్న మన రాష్ట్రంలోని మానసిక మరుగుజ్జులను చూసి ఈసడించుకోకుండా ఉండలేం. కమల పాలిత రాష్ర్టాలలో అవినీతి, అణగారినవర్గాలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, వైషమ్యాల విషం, ప్రతిపక్షాలపై జులుం, ఇలా చెప్పుకొంటూ పోతే గవర్నమెంటే గుండాగిరీ నడిపిస్తున్నది చూస్తూ, వింటూ కూడా బీజేపీ భజన మానని ముష్కరులను ప్రమాదకారులు అనకతప్పదు కదా! అలాంటి దరిద్రాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్న వారిని ఉన్మాదులనాలో, ద్రోహులనాలో సమాజమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వాలను కూల్చేవారిని పట్టుకొచ్చి, ప్రజాస్వామ్య పాఠాలు చెప్పిస్తున్నారు. బీజేపీ బలవడానికి జీవితాన్ని అంకితం చేసిన అద్వానీతో సహా అనేకమంది సీనియర్లను అవమానించిన వారితో ఉద్యమకారుల ముచ్చట పలికిస్తున్నారు. ఇలాంటి నియంతలకు తెలంగాణ దొరికితే, జరిగే దారుణాలకు అంతే ఉండదు. నిజాలను నిత్యం ప్రచారంలో పెట్టడంలో ఆలోచనాపరులు ఏమరుపాటుగా ఉంటే, అబద్ధం అందంగా ముస్తాబై అందరినీ వెంట మలుపుకొనే ప్రమాదం ఉన్నది. అందుకే గులాబీ సైనికులమందరం గొంతెత్తుదాం.
గర్భవతుల ఆత్మగౌరవం కోసం, పుట్టే ప్రతి శిశువుకు బాధల్లేని బతుకునివ్వడం కోసం అమ్మవొడి వాహనాలు, కేసీఆర్ కిట్, దవాఖానల్లో క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రవేశపెట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్. వాటి ప్రారంభోత్సవానికి హైదరాబాద్లోని పేట్లబురుజు దవాఖానకు వచ్చిన కేసీఆర్ ఒక తల్లి చేతికి కేసీఆర్ కిట్ అందించాడు. ఈ మానవీయ పథకం ప్రారంభాన్ని చూసి కదిలిపోయిన ఒక డాక్టరమ్మ హటాత్తుగా కేసీఆర్ చెయ్యందుకొని ముద్దుపెట్టి.. సార్ నీవు కలకాలం చల్లగా వర్ధిల్లాలని దీవించింది. ఇది నాటి ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరి కళ్లూ చెమర్చేలా చేసింది. మరణాలు, రోదనలు కండ్లారా చూసిన దవాఖాన సిబ్బందికి, పిల్లల నవ్వులు, కేరింతలను వాగ్దానమిచ్చిన కేసీఆర్, మానవీయ ముఖ్యమంత్రిగా కనిపించి, కదిలించాడు. అలాంటి నాలుగు వందల యాభైకి పైగా సంక్షేమ పథకాలను అమలుపరిచి, తెలంగాణ సమాజానికి ఆసరాగా, నిలిచిన కేసీఆర్ చెయ్యందుకొని చుంబించడం అందరికీ సాధ్యమపడకున్నా, ఆయన ఆలోచన అడుగుల్లో అడుగులేసి నడు ద్దాం. ఆర్తిగల్ల తెలంగాణ ఎప్పుడూ ఆదుకున్న నాయకుడినే ఆరాధిస్తుందని నిరూపిద్దాం.
అందుకే ‘అందుకో గుత్పందుకో.. దొంగల తరిమేటందుకు’ అనే పాట తొలి పలుకుల వెలుగులో, అదానీ పెంచిన రాజకీయ రాబందులు తెలంగాణపై వాలకుండా అందరం తిరగబడాలి. నిజాలను నిత్యం ప్రచారంలో పెట్టడంలో ఆలోచనాపరులు ఏమరుపాటుగా ఉంటే, అబద్ధం అందంగా ముస్తాబై అందరినీ వెంట మలుపుకొనే ప్రమాదం ఉన్నది. అందుకే గులాబీ సైనికులమందరం గొంతెత్తుదాం. ఎన్ని పథకాలు! ఎంత ప్రతిఫలాలు! అస లు ప్రయోజనం పొందని గడపుం దా? గతాన్ని దాటి, గట్టెక్కని గ్రామముందా? ఏ రంగంలోనైనా మన ప్ర గతికి తూగే రాష్ట్రమేదుందని? ఇంతచేసి, సరిహద్దును కాపాడే సిపాయిలా నిలిచి, తెలంగాణను గెలిపించిన కేసీఆర్ను మూర్ఖులు మాటలంటుంటే మర్లబడకుండా మనమెందుకుండాలి?
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242