ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, నీటి వాటాలో వివక్ష, రైతుకు ఇచ్చే ఎరువుల్లో వివక్ష, ఆఖరికి మాట్లాడే భాషపై కూడా వివక్షే… ఇట్లా ఎన్నో అవహేళనల మధ్య తల్లడిల్లింది తెలంగాణ. ఆ అవమానభారాన్ని పంటి బిగువున పట్టి పోరాటానికై రగులుతున్న తెలంగాణ నడిపించే నాయకుడి కోసం లక్షల కళ్లతో
ఎదురు చూడసాగింది.
1969 నాటి తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు, పెత్తందారులు నిర్వీర్యం చేసిన తీరు గుర్తుకువచ్చి తెలంగాణ లోకం ఆందోళనకు గురైంది. ఎందుకంటే అప్పటినుంచి తెలంగాణపై ఆంధ్రా పాలకుల అణచివేత మరింత పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కుట్రలను వ్యూహాత్మకంగా ఛేదించే నాయకుడి కోసం ఎదురుచూసింది. దగాపడ్డ, గోసపడ్డ తెలంగాణ తల్లి విముక్తి కోసం నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బయల్దేరిండు. అప్పటి ప్రభుత్వంలోని పదవులను తృణప్రాయంగా వదిలేసిండు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని ప్రజలకు, మేధావులకు పిలుపునిచ్చిండు. అకుంఠిత దీక్షతో కోట్లమందిని ఏకతాటిపైకి తెచ్చి రాష్ర్టాన్ని సాధించిండు. తెలంగాణ తల్లి విముక్తి కోసం కేసీఆర్ నాయకత్వంలో ఆదినుంచి పనిచేయడం నా అదృష్టం. ఉద్యమంలో
అప్పటి ఆంధ్రా పాలకుల కుయుక్తులను, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తీరు నాకు స్వీయానుభవమే.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాన్ని సాధించుకున్నాం. పాలనా బాధ్యతలు కూడా ఆయన నాయకత్వంలోనే ఉండాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. అప్పుడు మొదలైంది తెలంగాణ ప్రగతి. తెలంగాణ పడ్డ గోసను ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలిసిన నాయకుడు కొత్త రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమైంది. ఆంధ్రా పాలకుల పరిపాలనలో జీవచ్ఛవంగా తయారైన తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత అభివృద్ధిలో నేడు దేశానికే ఆదర్శమైంది.
నూతన సంస్కరణలు, ప్రపంచమే అబ్బురపడే సంక్షేమ కార్యక్రమాలు.. ఇలా ఎన్నో రంగాల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఎదిగి పురోగమిస్తున్నది. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్న ఆంధ్రా పాలకులకు కేసీఆర్ పరిపాలన చెంపపెట్టు.
ఇదిలా ఉంటే.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై, రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్పై కార్పొరేట్శక్తుల సమ్మెళితమైన బీజేపీ కన్నుపడింది. యావత్తు దేశం పసిగుడ్డు తెలంగాణ ప్రగతిపై ఆకర్షణకు గురవుతున్నది. కేసీఆర్ నాయకత్వాన్ని, రాష్ట్ర సంక్షేమ ఫలాలను, సాధిస్తున్న విజయాలను ఆసక్తిగా గమనిస్తున్నది. మా దగ్గర కూడా ఇట్లాంటి పాలన ఉంటే బాగుండు అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇది దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వానికి కన్ను
కుట్టినట్టయింది. భవిష్యత్తులో తమ ఉనికికి కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ప్రగతి ప్రమాదకరమని భావించి తమదైన శైలి కుట్రలకు తెరతీసింది. ఇక్కడి తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మోదీకి బానిసలుగా మారి, వారి కుట్రల్లో భాగస్వాములవుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రా పాలకులు తెలంగాణ మీద చూపిన వివక్షే నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్నాం.
నాడు ఆంధ్రా పాలకులు-నేడు బీజేపీ తెలంగాణకు ప్రధాన శత్రువులు. తెలంగాణ ప్రజలు, రైతులు, మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. మరోసారి పరాయివాడి పాలన కుట్రలో ఇరుక్కుంటే మళ్లీ గోస పడుతాం. మొన్నటి బడ్జెట్లో తెలంగాణపై బీజేపీ, మోదీ వివక్ష స్పష్టంగా కనిపించింది.
తెలంగాణకు మోదీ చేసిన అన్యాయాన్ని మర్చిపోలేం. కేంద్ర క్యాబినెట్ తొలి భేటీలోనే తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలిపారు. తెలంగాణలో ఉన్న సీలేరు హైడల్ ప్రాజెక్టును అన్యాయంగా ఆంధ్రకు కట్టబెట్టారు. విభజన చట్టంలోని హామీలను పూర్తిగా విస్మరించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీల ఊసేలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది.
అయినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు, మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని అప్పర్ భద్ర సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించారు. కానీ, ఎంతో ప్రతిష్టాత్మకమైన, దేశానికే పేరు తెచ్చిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు ‘కాళేశ్వరం’ లిఫ్ట్ ఇరిగేషన్కు మాత్రం జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా తేల్చాలని గత ఏడేండ్లుగా కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. పట్టించుకోకుండా తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు.
ఇది తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారనుంది. దేశవ్యాప్తంగా 16 ఐఐటీలు ఇస్తే తెలంగాణకు ఒక్క ఐఐఐటీ ఇవ్వలేదు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి వందల విజ్ఞప్తులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ కోసం ఢిల్లీలో తొక్కని గడప లేదు. ఇప్పటివరకు ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు. దేశంలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉంటుంది. కానీ ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఆ జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఒక్కటి కూడా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదు.
దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. 900 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులు ఇవ్వట్లేదు. 2014-15లో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్ల నిధులు ఆంధ్రకు మళ్లించారు. ఇప్పటివరకు వాటి ఊసే లేదు. రాష్ర్టానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపుల్లేవు. చివరికి తెలంగాణ పండించిన ధాన్యాన్ని కొనమంటే ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇట్లా.. ఏడేండ్లుగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్షపూరిత వైఖరి
ప్రదర్శిస్తున్నది. తెలంగాణను శత్రువుగా చూస్తున్నది.
ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న మన నాయకుడు కేసీఆర్కు దన్నుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మన వేలితోనే మన కంట్లో పొడిచే కుటిల రాజకీయ కుట్రకు తెరదీశారు. మన అస్తిత్వంపై దెబ్బకొట్టాలని చూసే పరాయి పాలకుల పట్ల ఎప్పటికీ తెలంగాణ సమాజం అప్రమత్తంగానే ఉండాలి. నాడు ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ సమాజం ఎంత వివక్షను ఎదుర్కొన్నదో, నేడు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా అంతే వివక్ష ఎదుర్కొంటున్నది. చివరగా నేను తెలంగాణ ప్రజలకు, రైతులకు, యువతకు, మేధావులకు చెప్పదలుచుకున్నదేమంటే ‘మోసపోతే-గోస పడుతాం’. తెలంగాణను శత్రువుగా చూస్తున్న బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉందాం.
దేశవ్యాప్తంగా 16 ఐఐటీలు ఇస్తే తెలంగాణకు ఒక్క ఐఐఐటీ ఇవ్వలేదు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి వందల విజ్ఞప్తులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ కోసం ఢిల్లీలో తొక్కని గడప లేదు. ఇప్పటివరకు ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు. దేశంలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉంటుంది. కానీ ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఆ జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఒక్కటి కూడా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదు.
తెలంగాణకు మోదీ చేసిన అన్యాయాన్ని మర్చిపోలేం. కేంద్ర క్యాబినెట్ తొలి భేటీలోనే తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలిపారు. తెలంగాణలో ఉన్న సీలేరు హైడల్ ప్రాజెక్టును అన్యాయంగా ఆంధ్రకు కట్టబెట్టారు. విభజన చట్టంలోని హామీలు పూర్తిగా విస్మరించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీల ఊసేలేదు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు, మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని అప్పర్ భద్ర సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించారు. కానీ, ఎంతో ప్రతిష్టాత్మకమైన, దేశానికే పేరు తెచ్చిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు ‘కాళేశ్వరం’ లిఫ్ట్ ఇరిగేషన్కు మాత్రం జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు.
-వేముల ప్రశాంత్రెడ్డి
(వ్యాసకర్త: రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి)