దేశం కోసం.. ధర్మం కోసం.. అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిపాటైంది. ఆ పేరుతో అమాయక యువకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారు. విద్వేషమే ప్రధానాస్త్రంగా పచ్చని తెలంగాణలో కషాయం చిమ్మడానికి కత్తులు దూస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధ్ది పొందడమే లక్ష్యంగా అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలూ చేస్తున్నారు.
మోదీ సర్కారు అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి లేకుం డా చేస్తానని, నల్ల కుబేరుల అవినీతికి అడ్డుకట్ట వేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం తమ కార్పొరేట్ దోస్తుల కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడుతున్నది. అదానీ లాంటి బడా కార్పొరేట్ దారులకు కోట్లల్లో రాయితీలు ఇప్పించడమే కాకుండా.. వారికి పూర్తి స్థాయి లో మినహాయింపులు ప్రకటించింది. దేశం లో అధికారమే లక్ష్యంగా కేంద్ర సర్కారు దిగజారి ప్రవర్తిస్తున్నది. పార్టీల్లో చీలికలు తెచ్చి తమ ప్రభుత్వాలను ఏర్పాటుచేసుకోవడంపైనే దృష్టిసారిస్తున్నది.
దేశాన్ని ఆర్థికంగా దిగజారుస్తూ రోజురోజుకూ ప్రైవేటు శక్తుల్లోకి తీసుకెళ్లేలా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రైల్వే, ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించారు. అవినీతిని అంతం చేస్తామంటూ.. డైలాగులు కొట్టిన బీజేపీ.. నీతి తప్పుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. తెలంగాణకు రావాల్సిన నిధులనుకావాలని పెండింగ్లో పెట్టి కక్ష సాధింపునకు పాల్పడుతున్నది.
వాస్తవానికి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా తక్కువే. ఈ సంగతి అనేక విషయాల్లో రుజువైంది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు.. కేసీఆర్ నాయకత్వంలో తెగింపుతో పరిపాలన సాగిస్తున్నది. దేశం కోసం బీఆర్ఎస్ పేరుతో కదులుతున్న ఉద్యమ నేత గౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ప్రయత్నిస్తున్నది. అయినప్పటికీ కేసీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్మం మాట లు మాట్లాడుతూ అధర్మపు పనులతో బీజేపీ కేంద్ర సర్కారు వ్యవహరిస్తున్నది.
బాగుపడుతున్న తెలంగాణలో వారికి కావాల్సింది అధికారం. దానికోసం ఎంతకైనా తెగించడానికి సిద్దంగా ఉన్నారు బీజేపీ నాయకులు. కేసీఆర్ మీద అక్కసు వెళ్లగక్కడం తప్ప మోదీ, అమిత్ షాలు తెలంగాణకు చేసిందేమీ లేదు. ఇటీవల వందేభారత్ రైలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైలు మార్గంలో ఓ ఎద్దు అడ్డువస్తే.. ఆ రైలు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఇదే కాకుండా క్రికెట్ గురించి ఏ మాత్రం తెలియని అమిత్ షా కొడుకు బీసీసీఐలో కీలక బాధ్యతల్లో ఉన్నాడు. అర్హత లేనివారిని అందలమెక్కిస్తూ.. మాడ్లాడితే దేశం కోసం ధర్మం కోసమని చెప్పే బీజేపీ అదర్మబద్ధంగా వ్యవహరిస్తున్నదనడానికి అనేక కారణాలు న్నాయి. దేశమంతా వైద్య కళాశాలలను ప్రకటించిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది.
భారీ ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం సిద్ధ్దమైన తరుణంలో బీజేపీ నాయకులు లీకేజీ కుట్రలు పన్నారు. తెలంగాణలో విద్వేషపు విషబీజాలు నాటే ప్రయత్నాన్ని ప్రభుత్వం పసిగట్టింది. పదవ తరగతి పేపర్ లీకేజీలో ముఖ్యపాత్ర పోషించిన బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పటిమతో విభజన లోపాలను ఒక్కొక్కటి అధిగమిస్తూ… పరిష్కార మార్గాలను ఆలోచిస్తూ తెలంగాణను పటిష్ఠంగా నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై అసహనం కలిగేలా కుట్రలకు పాల్పడుతున్నది. మతంతో మంటలు రేపేలా బీజేపీ నాయకులు ప్రయత్ని స్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకం ప్రకటన చేస్తే.. యువతను రాజకీయాలకు దూరంగా ఉంచడానికే అం టూ అర్థం లేని మాటలు మాట్లాడారు. భారీ ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం సిద్ధ్దమైన తరుణంలో బీజేపీ నాయకులు లీకేజీ కుట్రలు పన్నారు. తెలంగాణలో విద్వేషపు విషబీజాలు నాటే ప్రయత్నాన్ని ప్రభుత్వం పసిగట్టింది. పదవ తరగతి పేపర్ లీకేజీలో ముఖ్యపాత్ర పోషించిన బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడే ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతుంటే కిందిస్థాయి నాయకుల తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పదికి పైగా రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి.. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టిన బీజేపీ నాయకులు దేశం కోసం, ధర్మం కోసమనే నీతి వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. ఆ మాటల వెనుకున్న కుట్రలను ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం గుర్తించి తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
సంపత్ గడ్డం: 78933 03516
(వ్యాసకర్త -బీఆర్ఎస్వీ, దళిత విద్యార్థి నాయకుడు’)