HomeEditpage3 4 Crore Escaped Poverty In Uttar Pradesh In Most In India Niti Aayog
సంక్షేమానికి జై.. పేదరికానికి బైబై
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడుదల చేసింది.
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారం… తెలంగాణ అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించి మిగతా రాష్ర్టాల కంటే ముందున్నది.
నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక కోసం ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, స్కూలుకు వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంట గ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నది. 2015-16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4తో పాటు 2019-21లో నిర్వహించిన 5వ సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదికలో 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బహుళ పేదరిక సూచీలను విడుదల చేసింది. వీటిలో తెలంగాణ అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం.
నీతి అయోగ్ నివేదిక ప్రకారం… దేశంలో 2015-16 – 2019-20 మధ్యకాలంలో బహుమితీయ పేదల సంఖ్య 24.85 శాతం నుంచి 14.96 శాతానికి క్షీణించింది. ఐదేండ్లలో 13.5 కోట్ల మందికి పైగా భారతీయులు బహుమితీయ పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది. నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఏ ప్రోగ్రెస్ రివ్యూ-2023 అనే నివేదిక ప్రకారం… గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి వేగంగా క్షీణించింది.
యూపీలో అత్యధికంగా 3.43 కోట్ల క్షీణత నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లు ఉన్నాయి. పేదరికాన్ని తగ్గించడంలో పోషకాహారంలో మెరుగుదల, పాఠశాల విద్య, పారిశుద్ధ్యం, వంట ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషించాయని, పేదరికాన్ని తగ్గించడానికి దారితీసిన మొత్తం 12 సూచీలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొన్నది. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని నీతి అయోగ్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికే 5.88 శాతం దిగువకు తగ్గడం గమనార్హం. ఈ మేరకు పేదరికం సూచీలో దేశంలో తెలంగాణ 21వ స్థానంలో నిలిచింది.
రాష్ర్టాల వారీగా చూస్తే… బీహార్ 33.75 శాతం పేదలతో మొదటి స్థానంలో, జార్ఖండ్ (28.81 శాతం), మేఘాలయ (27.79 శాతం), యూపీ (22.93 శాతం), మధ్యప్రదేశ్ (20.63 శాతం) రెండో స్థానంలో ఉన్నాయి. యూపీలో 3.34 కోట్ల మంది పేదరికానికి దూరమయ్యారని, ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్ ఉండగా, తెలంగాణలో 27,61,201 మందికి పేదరికం నుంచి విముక్తి కలిగినట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఐదేండ్లలోనే 7.3 శాతం మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు దోహదపడ్డాయని విశ్లేషకుల అభిప్రాయం.
రాష్ట్ర ప్రజలపై పేదరికం ప్రభావం 40.85 శాతంగా ఉన్నదని, రాష్ట్రంలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజల్లోనే పేదరికం ఎక్కువగా ఉన్నదని తేల్చారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 7.51 శాతం మంది పేదరికంలో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 2.73 శాతం మంది పేదరికంలో ఉన్నట్టు తేలింది. అయితే, 2015-16తో పోలిస్తే, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి పేదరిక తగ్గించడంలో కృషిచేసింది.
జిల్లాల వారీగా చూస్తే పేదరికంలో ఆసిఫాబాద్ జిల్లా మొదటి స్థానంలో, గద్వాల రెండో స్థానంలో, ఆదిలాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. 39 శాతం వంట లేకపోవడం, 24.41 శాతం పారిశుద్ధ్య లోపం, 3.36 శాతం తాగునీటి కొరత, 20.49 శాతం మందికి ఇండ్లు లేవని, 8.51 శాతం మందికి ఆస్తులు లేవని, 2.74 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవని నివేదిక వెల్లడించింది.
ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడే పలు అంశాలను ప్రభావితం చేసే తెలంగాణ ప్రధాన పథకాలు కూడా పేదరికాన్ని తగ్గించడంలో దోహదపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, కేసీఆర్ కిట్, ఆరోగ్య శ్రీ, గురుకులాల్లో ఎక్కువ విద్యార్థ్ధుల నమోదు, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛ తాగునీటి సరఫరా, పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, నగర ప్రాంతాల పారిశుద్ధ్య కార్యక్రమాలు, సామాజిక భద్రత కోసం ప్రభు త్వం ఇస్తున్న పలు పింఛన్లు, దళితబంధు లాం టి ప్రభుత్వ పథకాలు కూడా తెలంగాణ పేదరికం తగ్గడానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం… జాతీయ ఆర్థికవ్యవస్థకు అత్యధికంగా సహకరించే రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో ఉండగా, తెలంగాణ సగటు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు 8.6 శాతం నమోదు చేసింది. ఇది దేశంలోనే 3వ అత్యధికం. తెలంగాణ రాష్ట్రం పలురంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం… జాతీయ ఆర్థికవ్యవస్థకు అత్యధికంగా సహకరించే రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో ఉండగా, తెలంగాణ సగ టు స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి రేటు 8.6 శాతం నమోదు చేసింది. ఇది దేశంలోనే 3వ అత్యధికం. తెలంగాణ రాష్ట్రం పలురంగాల్లో అభివృద్ధి చెందుతుంది. పూర్తిస్థాయిలో పేదరికాన్ని తగ్గించడంలో తెలంగాణ ఎదగాలంటే దేశం ఆర్థికవ్యవస్థలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా కేంద్రం కృషి చేయాల్సి ఉన్నది. మిగతా పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఐదేండ్లలో పేదరిక శాతం తగ్గి, నేడు జాతీయస్థాయిలో తొమ్మిదేండ్ల తెలంగాణ, చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే నంబర్-1గా నిలిచిందని నేటి గణాంకాలే చెప్తున్నాయి.