టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా రూపకల్పన చేసి, దేశవ్యాప్తంగా ధర్మ పోరాటానికి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నుదుట మొట్టమొదటగా విజయ తిలకం దిద్దిన ఘనత సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఓటర్లకు దక్కుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయాలపై తల పడే బీఆర్ఎస్కు ఇది ప్రయోగశాలగా మారింది. నిస్సహాయతో, కుతంత్రమో కానీ కాంగ్రెస్ చేతులెత్తేసి ప్రేక్షకపాత్ర వహించిన నేపథ్యం లో, పోటీ బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యనే సాగింది.
ఎన్ని కలు జరిగే ప్రాంతాలు తన పార్లమెంటరీ స్థానం పరిధిలోనే ఉండటంతో బీజేపీ పెద్ద ఒకరు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మండలాల వారీగా నాయకులను నియమించి, ధనబలంతో, తన సహజశైలిలో దురుసు పదాలతో తెగబడ్డారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధాల ప్రచారం కూడా సాగింది. సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం కావడంతో, ఏ కొద్ది స్థానాలు సాధించినా, బెబ్బులిని దాని గుహలోనే ఢీకొన్న ఘనత దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఓటరు మహాశయులు మొత్తం పదిహేను సీట్లూ బీఆర్ఎస్ మద్దతు గల అభ్యర్థులకే కట్టబెట్టి బీజేపీ స్థానమేమిటో చూపించారు.
దేశమంతా సహకార స్ఫూర్తి పొంగిపొరలుతున్నప్పుడు ఏర్పడిన తొట్టతొలి సంస్థలలో సెస్ ఒకటి కావడం వల్ల ఈ ప్రజాతీర్పుకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ పాలకులు సహకార స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. పబ్లిక్ రంగాన్ని అప్పనంగా ప్రైవేటుకు అప్పగిస్తు న్నారు. బడావ్యాపారులు లక్షల కోట్ల రూపాయలను ఎగ్గొట్టినా పట్టించు కోకుండా, సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ పేద ప్రజలను అవమానిస్తున్నారు. రైతులపై వాహనాలు నడిపించారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ రంగాన్ని ప్రాణపదంగా చూస్తున్నారు. మనది రైతు రాజ్యమని సగర్వంగా ప్రకటించారు. కుల వృత్తులను ఆదుకున్నారు. ఊరూరా మంచినీటికీ, సాగునీటికీ కొదువలేదు. కరెంటు కోత లేదు, ఎండు డొక్కలు లేవు. ఈ రెండు పోకడలను గమనించి సెస్ ఓటర్లు బీఆర్ఎస్కు హారతి పట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు.
సెస్లో ఎన్నికల సమరం రెండు భిన్న సంస్కృతుల మధ్య పోరాటం గా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాజకీయాలలో గుణా త్మక మార్పును తీసుకొచ్చారు. తన మాటలు-చేతల ద్వారా, పరిపాలన ద్వారా రాజకీయాలను పునర్నిర్వచించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం, ఎన్నికలలో తాను సాధించినదేమిటో, భవిష్యత్తు లో చేయదలుచుకున్నదేమిటో చెప్పడం అనే కొత్త విధానాన్ని అనుసరిం చారు. కానీ బీజేపీ నేతలు మొదటి నుంచి విద్వేష రాజకీయాలు నడుపు తున్నారు. వారికి ప్రజల విజ్ఞత మీద నమ్మకం లేదు. కానీ కేసీఆర్ ప్రవేశ పెట్టిన విలువలతో కూడిన రాజకీయాలు అలవాటైన తర్వాత ప్రజలు పాతకాలపు వికృత ప్రచారాలను ఈసడించుకోవడం సహజం. ఇప్పుడు సెస్ ఎన్నికలలో జరిగిందీ, రేపు దేశ వ్యాప్తంగా జరిగేది ఈ ధర్మ పోరాటమే.