నిజామాబాద్ : నవీపేట మండలం మల్లేశ్వరం గ్రామంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున కొండూరు సాయిలు అనే వ్యక్తి తన నివాసం పక్కన ఉండే రాయల పెద్ద పోశెట్టితో పాటు మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మల్లేశ్వరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.