వనస్థలిపురం : అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురంలో నిర్మిస్తున్న వరదనీటి బాక్స్ డ్రైన్ పైప్లైన్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పనులు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముంపు నివారణే లక్ష్యంగా డ్రైన్ను నిర్మిస్తున్నామన్నారు. ఈ పనులతో రెడ్డి కాలనీ, పరిసర ప్రాంతాలకు ఉపశమనం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.