ముషిరాబాద్ : మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని పురుషులతో సమానంగా రాణించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్ రిసాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీనా మెహందీ సెంటర్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిండ్లకు ఆర్థిక సహాయం చేస్తున్న ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
స్వయం ఉపాధి రంగాలలో మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రొత్సహిస్తున్న స్వచ్చంద సంస్థలకు తొడ్పాటునందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఎన్.శ్రీనివాసరావు, ఆర్.మోజస్, ఫారుఖ్, ఇజాజ్, సాబేర్, హినా మోహంది సెంటర్ నిర్వాహకురాలు ఫిరిదా, వాహిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.