మాదాపూర్ : గోకుల్ ప్లాట్స్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో బుధవారం స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … గోకుల్ ప్లాట్స్ కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అన్ని రకాల మౌలిక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వరద నీటి కాలువ నిర్మాణ పనులను స్థానిక అధికారులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అధికారులకు తగు సూచనలు, సలహలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, అప్పారావు, గణేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.