మైలార్దేవ్పల్లి : లక్ష్మిగూడలో ఉన్న శ్మశాన వాటిక సమస్య పరిష్కరించి అభివృద్ది చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడ బస్తీలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై అధికారులతో కలిసి పర్యటించారు.
ఎస్సీ, బీసీల స్మశాన వాటికలను పరిశీలించారు. శ్మశాన వాటికలలో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..బస్తీలలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక ప్రజలకు సూచించారు.
శ్మశాన వాటికలలో ఉన్న సమస్యలను , రోడ్లపై పారుతున్న మురుగు సమస్యలను పరిష్కరింస్తానని ప్రజలకు హమీ ఇచ్చారు. సుబాన్ కాలనీలో రోడ్డుపై పారుతున్న మురుగు నీటి సమస్య తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఉపకమిషనర్ జగన్ , ఈఈ నాగేందర్గౌడ్ , ఏఈ బల్వంత్రెడ్డి, మాజీ కార్పొటర్ ప్రేమ్దాస్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ , రఘుయాదవ్ , సరికోండ వెంకటేష్ , జాంబవంతు యూత్ సభ్యులు పాల్గొన్నారు.