సైదాబాద్ : సైదాబాద్ ఎల్ఐసీ కాలనీలో ఓ ఆపార్టుమెంట్లో నెలకొన్న వివాదంతో అందులో నివసించే ప్రేమ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హైడ్రామా సృష్టించాడు. ఆపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే ఓ కుటుంబం సభ్యులు బోర్ కనెక్షన్ను తొలగించి నీళ్లు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.
అంతటితో ఆగకుండా తమకు నీళ్ల సరఫరా చేసేంతవరకు బిల్డింగ్ నుంచి కిందకు దిగమని, కిందకు దూకి ఆత్మహత్యకు చేసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు వచ్చి వారికి నచ్చజేప్పి, బోరింగ్ నీళ్లు సరఫరా అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు.
పోలీసులు ఆపార్టుమెంట్ వాసులతో చర్చించి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అపార్టుమెంట్ కమిటీ ప్రతినిధులను అదేశించారు.