ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ దీన్దయాల్నగర్ బస్తీలో కనీస సౌకర్యాలు కల్పించనున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పేదల బస్తీల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం ఆయన దీన్దయాల్నగర్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు డ్రైనేజీ, మంచినీరు, రోడ్డు, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు.
అదేవిధంగా వాంబే ఇళ్లు శిథిలావస్థకు చేరుకొని స్లాబు పెచ్చులూడుతున్నాయని, భవనానికి మరమ్మతులు చేయించా లని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ముషీరాబాద్ చేపల మార్కెట్లో ఎమ్మెల్యే పర్యటించి పారిశుద్ధ్య, మ్యాన్హోల్ నిర్మాణ పనులను పరిశీలించారు.