సైదాబాద్ : కరోనా మహమ్మారితో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దేవసారి గణేష్ (48) సోమవారం నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య రేఖ, కుమార్తె లోహితాక్షరి ఉన్నారు. సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఎరుకల బస్తీకి చెందిన దేవసారి గణేష్కు కరోనా పాజిటివ్ రావటంతో కొన్ని రోజులుగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
జీహెచ్ఎంసీ గాజుల రామారాం సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న గణేష్కు ఈ మధ్యకాలంలో పదవోన్నతితో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా బదిలీ అయ్యారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా భారీన పడటంతో పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన మరణించటంతో పలువురు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి సంతాపం వ్యక్తం చేశారు.