మియాపూర్ : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారామచంద్రులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి బుధవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలతో పాటు స్వామి వార్ల ప్రసాదాన్ని విప్ గాంధీకి అందించారు. అనంతరం గోశాలలో గోవులకు విప్ మేత అందించారు. ఆయన వెంట కమ్మ సంఘం ప్రతినిధులు రవిశంకర్రావు, రత్నాకర్రావులు పాల్గొన్నారు.