గుండాల/ఆత్మకూర్(ఎం)/ఆలేరు టౌన్, డిసెంబర్ 20 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛ సర్వేక్షణ్ టీమ్ సభ్యురాలు అంజలి సూచించారు. సోమవారం గుండాల మండలంలోని తుర్కలశాపురంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధులన్నీ తిరిగారు. చెత్త సేకరణ, మురుగును ఏ విధంగా బయటకు పంపుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట డీఎల్పీఓ యాదగిరి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీఓ జనార్దన్రెడ్డి, మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆండాళ్, సర్పంచ్ భిక్షమయ్య, ఎంపీటీసీ నరేశ్, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఆత్మకూర్(ఎం)మండలంలోని పారుపల్లి గ్రామాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్ర బృందం సభ్యురాలు మౌనిక పరిశీలించారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మురుగు కాల్వలు, సీసీరోడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట డీపీఓ సునంద, ఏపీడీ శ్యామల, స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రత్యేకాధికారి రాజారామ్, ఎంపీడీఓ రాములు, సర్పంచ్ రమేశ్గౌడ్, ఎంపీఓ పద్మావతి, ఏపీఓ రమేశ్ ఆలేరు మండలంలోని శారాజీపేట, టంగుటూరు గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం పరిశీలించారు. తడి, పొడిచెత్తను వేరు చేయడం, కంపోస్ట్ ఎరువు తయారీని పరిశీలించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు కిశోర్, మధు, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, సర్పంచులు పాల్గొన్నారు.