చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు దేవాలయ కార్యనిర్వాహణాధికారి కె.రామాంజనేయులు, ఆలయ వ్యవస్థాపక వంశీయుడు కి.శే.జి.రాజేంద్రనాథ్ గౌడ్ కుమారుడు శ్రీనాథ్ గౌడ్లు బుధవారం దేవాలయంలో మాట్లాడారు. ఈ నెల 19నుంచి 21వరకు పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
గురువారం ఉదయం పవిత్రాహ్వానము, స్వస్తివాచనము, రక్షబంధనముతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 21న పుర్ణాహుతితో ముగుస్తాయని తెలిపారు. చివరిరోజున 41 కలశములతో అభిషేకము, తిరుమంజనము, మహానైవేద్యము, మంత్ర పుష్పము, పవిత్ర ప్రదానము, చందన గోష్టి, అశిర్వాదము పండిత సన్మాన కార్యక్రమాలు జరిగుతాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.