మహేశ్వరం : ప్రతి ఒక్కరు కోవిడ్-19 టీకాలను వేయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లల్లో ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్లను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ఒక్కరూ భయాందోళనలకు గురికాకుండా టీకాలను వేయించుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ను తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె అన్నారు.
ప్రజలందరూ వ్యాక్సినేషన్ ను తీసుకొనే విదంగా వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచినట్లు ఆమె అన్నారు. కరోనా కష్ట కాలంలో మున్సిపాలిటీలల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. అందరూ టీకాలను వేయించుకు నే విధంగా నాయకులు చొరవచూపాలని ఆమెకోరారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగి రింత పారిజాత నర్సింహ్మరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్లు కృష్ణమోహనరెడ్డి, జ్ఞానేశ్వర్, ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డి , తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానివెంకట్రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.