మెదక్రూరల్/నిజాంపేట/మనోహరాబాద్/చేగుంట/హవేళీఘనపూర్/ రామాయంపేట, జనవరి 6 : హవేళీఘనపూర్లోని కూచన్పల్లి జడ్పీ హైస్కూల్లో గురువారం టీనేజర్లకు కరోనా టీకావేసినట్లు సర్దన పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల వయస్సు గల విద్యార్థులకు కరోనా వ్యాక్సినేషన్ చేయాలన్న ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవాగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, పీఈటీ మధు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు వైద్యసిబ్బంది టీకాలు వేశారు. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి ,సిబ్బంది సత్తమ్మ, వైస్ ప్రిన్సిపాల్ సిద్ధిరాంరెడ్డి, బాలప్రకాశ్, నాగలక్ష్మి, మల్లేశం, శ్రీదేవి, మాధవి, శ్రీనివాస్, అశోక్, బాబురావు, బాలగౌడ్, నర్సింహులు, శ్రీశైలం ఉన్నారు. చేగుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 160మంది విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. ప్రిన్సిపాల్ హరిప్రసాద్ నాయుడు పాల్గొన్నారు. మనోహరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన వ్యా క్సినేషన్ను జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మెదక్ మండలపరిధిలోని మంబోజిపల్లిలో రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారికి మండల వైద్యాధికారి చంద్రశేఖర్ వ్యాక్సిన్ వేశారు.