మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1లో బుధవారం ఉదయం 9:35 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యాధితో వ్యక్తి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుని వయస్సు సూమారు 60-65 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఒంటి పై బ్లూ రంగు లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.