మారేడ్పల్లి : రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం ఉదయం గౌడవల్లి-గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వయసు సూమారు 40-45 సంవత్స రాలు ఉంటాయని, ఒంటి పై ఎరుపు రంగు టీ ష్టర్లు, లైట్ బ్లూ రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేసుకున్నారు.