వీణవంక: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు మద్దుతుగా ఆ పార్టీ సౌతాఫ్రికా ఎన్నారై శాఖ రంగంలోకి దిగింది. వీణవంక మండలంలో శనివారం ఆ మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఎన్నారై శాఖ హుజూరాబాద్ క్యాంపెయిన్ ఇన్చార్జి నల్ల శివారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ తిరుగుతూ వివరిస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శివారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్లముందు ఉన్నదని, అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటున్నారని చెప్పారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తమ ఎన్నారై శాఖ పక్షాన గట్టి కృషిచేస్తామని వెల్లడించారు. అతి త్వరలోనే హుజూరాబాద్, జమ్మికుంటలో తమ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, మిగతా కార్యవర్గ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, అల్లపురెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ సౌతాఫ్రికా ఎన్నారై శాఖ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.