కందుకూరు : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావును టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు. దీపావళి పండగను పురస్క రించుకొని మండల పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ జంబుల గణేష్రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు భీమ్రెడ్డి క్రిష్ణరాంభూపాల్రెడ్డి, పులిమామిడి మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనేగౌని అంజయ్యగౌడ్లు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.