హిమాయత్నగర్ : టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ను గురువారం హిమాయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జడల హేమలత యాదవ్ కలిసి పూలబొకేను అందించి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోని ప్రజలకు అందేలా చొరవ తీసుకుని నిబద్ధతతో పార్టీ బలో పేతం కోసం కృషి చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జె.బాబుయాదవ్, కృష్ణయాదవ్, ఎన్.గణేష్ ముదిరాజ్, సోయల్జాబ్రీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.