మెహిదీపట్నం : పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్నీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న పథకాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు అన్నారు. గురువారం సాయంత్రం నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణ,దళిత బంధు పథకం ప్రారంభంపై నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు కోరుకుంటున్న విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు.