నవాబ్పేట, జనవరి 2: గల్లీ నుంచి ఢిల్లీకి పంపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, పాలమూరు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఎంపీ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ మన్నె హాజరై భారీ కేక్ను కట్ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఎంపీని సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగంలో ఉంటూ.. సమాజసేవ చేస్తున్న ఎంఎస్ఎన్ కుటుంబాన్ని గుర్తించి ఎంపీ టిక్కెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ను, గెలిపించిన ప్రజలను ఎన్నటికీ మరిచిపోనన్నారు. మా కుటుంబానికి ప్రజా సేవ చేసేందుకు మంచి అవకాశం దక్కిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి తనకు తోచిన సాయం చేస్తాననన్నారు. నవాబ్పేటలో ఇంత పెద్ద ఎత్తున నా జన్మదిన వేడుకలు నిర్వహించిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా నవాబ్పేట మండలం గురుకుంట గ్రామంలోని సాయిబాబా దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానికి చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, మండల రైతుబంధు కన్వీనర్ మధుసూదన్రెడ్డి, సర్పంచులు గోపాల్గౌడ్, యాదయ్యయాదవ్, సత్యం, కృష్ణయ్య, ఎంపీటీసీలు రాధాకృష్ణ, గోపీకృష్ణ, కోఆప్షన్ సభ్యులు తాహేర్, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు ప్రతాప్, చెన్నయ్య, మెండె లక్ష్మయ్య, చందర్నాయక్, సేవ్యానాయక్, అబ్దుల్లా, శంకర్నాయక్, గాండ్ల రవి, ఎర్రోళ్ల శ్రీను, యాదయ్య, సంజీవరెడ్డి, గండు తిరుపతయ్య, ఉప సర్పంచులు రవికిరణ్, సంతోష్కుమార్, భీమయ్య, శ్రీశైలం, దేశానాయక్ పాల్గొన్నారు.