శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్- రుక్కలి రెండో కుమారుడు ముడావత్ మున్న ఒంటిచేత్తో నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన నవనీత్సింగ్ అనే వ్యక్తి ఒంటిచేతితో నిమిషానికి 284సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
అతడిని ఆదర్శంగా తీసుకున్న మున్న ఎలాగైన నవనీత్సింగ్ రికార్డును తిరగరాయలని భావించి ప్రాక్టీస్ చేశాడు. అలా ఆగస్టు 5న నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొడుతూ ఆన్లైన్లో ఇండియా బుక్ఆఫ్ రికార్డులో దరఖాస్తు చేసుకున్నా డు. మున్న ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ఆఫ్ రికార్డు సంస్థ ఇండియా బుక్ఆఫ్ రికార్డుబుక్లో స్థానం కల్పించింది.