బేగంపేట్ : జమిస్తాన్పూర్, సీతాఫల్మండి సబ్స్టేషన్ పరిధిలోని విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్లు కారణంగా సోమవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. జమిస్తాన్పూర్ సబ్స్టేషన్ ఎప్పి కాలేజ్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వర కు టీఆర్ అపార్ట్మెంట్, ఎల్లమ్మ టెంపుల్, స్కందగిరి ఏరియా, బ్రూక్బాండ్ ఏరియాలలో పై విధంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.
సీతాఫల్మండి సబ్స్టేషన్ గాంధీ విగ్రహాం ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నాం 2 గంట వరకు గాంధీ విగ్రహాం, ఎంసీహెచ్ పార్కు, లైఫ్ స్ప్రింగ్ ఆసుపత్రి, ఈ సేవా, బొందల గడ్డ, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు. వారసిగూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు సీతాఫల్మండి, మైలార్గడ్డ, రోడ్డు నెం 1, ఘరోండ ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ నిలిపి వేస్తామని విద్యుత్శాఖ అధికారులు తెలిపారు.