కవాడిగూడ : మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవత్వాన్ని ప్రభోదిస్తాయని వాటిని ఆచరించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని అఖిల్ షా దర్గా వద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ఉన్ నబి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భోలక్పూర్లోని ప్రధాన వీదుల గుండా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేడుకలకు హాజరై ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి, ధర్మం, ప్రేమ అనుసరిం చాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని, ఆయన బోధనలను ఆచరించాలని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న పుడు అల్లా తప్పకుండా దాని ప్రతిఫలం అందిస్తారని మహమ్మద్ ప్రవక్త సూచించారని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ సామా జిక బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహలను సభీల్అహ్మద్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.