బడంగ్పేట్ : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనిలయ టౌన్షిఫ్లో ఒక యువకుడు అదృశ్యమైన సంఘటన మీర్పేట్ పోలీస్ ప్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మీర్పేట్ సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శ్రీనిలయ టౌన్షిఫ్లో నివాసముండే రాజుకు శివప్రసాద్ (16) అనే కొడుకు ఉన్నాడు.
కొడుకు స్కూలుకు వెళ్లడం లేదని గుర్తించిన ఆయన మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన శివప్రసాద్ ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద ఆరా తీసినా అతని అచూకి లభించక పోవడంతో గురువారం మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసారని అన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.