మహేశ్వరం : మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపాలిటీ అధికారులు, పోలీసులతో మాట్లాడి పలు సూచనలను చేశారు.
కమిషనర్ జ్ఞానేశ్వర్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు బాదావత్ రవినాయక్, బూడిద తేజస్విని శ్రీకాంత్గౌడ్, సప్పిడి లావణ్యరాజు మున్సిపల్ అధ్యక్షుడు జిల్లెల లక్ష్మయ్య పాల్గొన్నారు.