శంషాబాద్ రూరల్ : లారీ ఢికొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు మండలం ఇమ్ముల్నర్వ గ్రామానికి చెందిన అప్పర్ (55) పక్కనే ఉన్న జేపీ దర్గా (జహాంగీర్పీర్ దర్గా) వద్ద పూల వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు.
అయితే సోమవారం మధ్యాహ్నాం సమయంలో శంషాబాద్ వైపు నుంచి కొత్తూరు వైపు భైకుపై వెళ్తున్న అతడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢికొవడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియాకు తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు.